యూఏఈ లో 40 శాతం పెరిగిన ఇండియన్ రైస్ ధరలు..!
- July 26, 2023
యూఏఈ: బియ్యం ఎగుమతులపై భారతదేశం నిషేధం విధించిన తర్వాత యూఏఈలోని బియ్యం ధరలు 40 శాతం వరకు పెరిగాయని వ్యాపారులు తెలిపారు. అయితే, ఇది తాత్కాలిక సమస్య అని, కొత్త సరఫరాదారులు మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత త్వరలో ధరలు అందుబాటులోకి వస్తాయని రిటైలర్లు చెబుతున్నారు. వియత్నాం, థాయిలాండ్, పాకిస్తాన్ దేశాలలో రైస్ ఉత్పత్తి కొరత కారణంగా భారతదేశం ఎగుమతి నిషేధం తరువాత బాస్మతీయేతర బియ్యానికి యూఏఈలో డిమాండ్ ఏర్పడింది. బియ్యం ఎగుమతిలో భారతదేశం అతిపెద్ద బియ్యం ఎగుమతిదారులలో ఒకటిగా ఉంది. యూఏఈకి బియ్యం ఎగుమతుల్లో 40 శాతానికి పైగా వాటా ఇండియా కలిగిఉంది. గత సంవత్సరం మొత్తం 55.4 మిలియన్ మెట్రిక్ టన్నులు యూఏఈకి దిగుమతి అయ్యాయి. యూఏఈ దిగుమతిదారులకు బియ్యం దిగుమతి చేసుకునే ప్రధాన దేశఆలలో భారతదేశం తొలి ప్రాధాన్యత దేశంగా ఉందని అల్ మాయా గ్రూప్లో గ్రూప్ డైరెక్టర్, భాగస్వామి కమల్ వచాని తెలిపారు. స్థానిక వినియోగంలో బాస్మతీయేతర బియ్యం వాటా 45 శాతం, ఎక్కువగా దక్షిణ భారతీయులు వినియోగిస్తారని ఆయన అన్నారు. ధరలు 40 శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. ఫలితంగా, నివాసితులు ఖరీదైన ప్రధాన ఆహారానికి మారడం వల్ల బాస్మతి బియ్యం డిమాండ్ కూడా పెరుగుతుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







