“ఇండియన్ ట్రావెల్ అవార్డ్స్ 2023”లో అవార్డు అందుకున్న ఒమన్
- July 27, 2023
మస్కట్: న్యూ ఢిల్లీలో జరిగిన “ఇండియన్ ట్రావెల్ అవార్డ్స్ 2023”లో భాగంగా పర్యాటక రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థగా ఒమన్ హెరిటేజ్ మరియు టూరిజం మంత్రిత్వ శాఖ అవార్డును కైవసం చేసుకుంది. ఇండియా నుండి జనవరి నుండి మే 2023 వరకు సందర్శకుల సంఖ్యలో సుల్తానేట్ ఆఫ్ ఒమన్ రికార్డు స్థాయి పెరుగుదల నమోదు చేసింది. అంతకుముందు సంవత్సరం ఇండియా నుండి ఒమన్ను 234,509 మంది సందర్శకులు సందర్శించారు. హెరిటేజ్ అండ్ టూరిజం మంత్రిత్వ శాఖలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ టూరిజం ప్రమోషన్లో అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ టూరిజం ప్రమోషన్ అస్మా సలేమ్ అల్ హజ్రీ ఈ అవార్డును అందుకున్నారు. అస్మా అల్ హజ్రీ మాట్లాడుతూ.. ఈ అవార్డును గెలుచుకోవడం ఒమన్ సుల్తానేట్ సాధించిన విజయాన్ని సూచిస్తోందని, ఇది పర్యాటక రంగం సాధించిన అభివృద్ధిని ప్రతిబింబిస్తుందని, ప్రపంచంలోని వివిధ దేశాల నుండి పర్యాటకులను ఆకర్షించడానికి హెరిటేజ్ మరియు టూరిజం మంత్రిత్వ శాఖ చేసిన ప్రచార ప్రయత్నాలను ప్రతిబింబిస్తుందన్నారు. మరోవైపు జూలై 31 ఢిల్లీ, జైపూర్, కోల్కతా మరియు ముంబైలలో ఒమన్ పర్యాటక శాఖ వర్క్ షాపులును నిర్వహిస్తున్నది.
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







