“ఇండియన్ ట్రావెల్ అవార్డ్స్ 2023”లో అవార్డు అందుకున్న ఒమన్
- July 27, 2023
మస్కట్: న్యూ ఢిల్లీలో జరిగిన “ఇండియన్ ట్రావెల్ అవార్డ్స్ 2023”లో భాగంగా పర్యాటక రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థగా ఒమన్ హెరిటేజ్ మరియు టూరిజం మంత్రిత్వ శాఖ అవార్డును కైవసం చేసుకుంది. ఇండియా నుండి జనవరి నుండి మే 2023 వరకు సందర్శకుల సంఖ్యలో సుల్తానేట్ ఆఫ్ ఒమన్ రికార్డు స్థాయి పెరుగుదల నమోదు చేసింది. అంతకుముందు సంవత్సరం ఇండియా నుండి ఒమన్ను 234,509 మంది సందర్శకులు సందర్శించారు. హెరిటేజ్ అండ్ టూరిజం మంత్రిత్వ శాఖలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ టూరిజం ప్రమోషన్లో అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ టూరిజం ప్రమోషన్ అస్మా సలేమ్ అల్ హజ్రీ ఈ అవార్డును అందుకున్నారు. అస్మా అల్ హజ్రీ మాట్లాడుతూ.. ఈ అవార్డును గెలుచుకోవడం ఒమన్ సుల్తానేట్ సాధించిన విజయాన్ని సూచిస్తోందని, ఇది పర్యాటక రంగం సాధించిన అభివృద్ధిని ప్రతిబింబిస్తుందని, ప్రపంచంలోని వివిధ దేశాల నుండి పర్యాటకులను ఆకర్షించడానికి హెరిటేజ్ మరియు టూరిజం మంత్రిత్వ శాఖ చేసిన ప్రచార ప్రయత్నాలను ప్రతిబింబిస్తుందన్నారు. మరోవైపు జూలై 31 ఢిల్లీ, జైపూర్, కోల్కతా మరియు ముంబైలలో ఒమన్ పర్యాటక శాఖ వర్క్ షాపులును నిర్వహిస్తున్నది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









