ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ట్రోఫీ 2023 టూర్ రిజిస్ట్రేషన్ ప్రారంభం
- July 27, 2023
కువైట్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ట్రోఫీ 2023 టూర్ని కువైట్లో నిర్వహించేందుకు కువైట్ క్రికెట్ (కేసీసీ) రిజిస్ట్రేషన్ ను ప్రారంభించింది. సులైబియా క్రికెట్ గ్రౌండ్లో ఆగస్టు 10, 11 తేదీల్లో ప్రపంచ కప్ ట్రోఫీని ప్రదర్శించనున్నారు. క్రికెట్ ప్రపంచ కప్ ట్రోఫీ టూర్ను మొదటిసారిగా నిర్వహించడం పట్ల కేసీసీ ప్రెసిడెంట్ మిస్టర్ హైదర్ ఫర్మా హర్షం వ్యక్తం చేశారు. కువైట్ కు అవకాశాన్ని ఇచ్చిన ఐసీసీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక అవకాశం కువైట్ రాష్ట్రంలోని క్రికెట్ క్రీడను ప్రొత్సహిస్తుందన్నారు.
ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ట్రోఫీ ప్రపంచ వ్యాప్తంగా కువైట్, బహ్రెయిన్, మలేషియా, యూఎస్ఏ, నైజీరియా, ఉగాండా, ఫ్రాన్స్, ఇటలీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు ఆతిథ్య దేశం భారతదేశంతో సహా 18 దేశాలకు వెళ్లనుంది. 2019 నుండి మొదటి పూర్తి స్థాయి ట్రోఫీ టూర్, 2023 ఎడిషన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను అలరించనుంది. ప్రపంచ కప్తో ఫోటో తీసుకోవడానికి, ఉచిత ప్రవేశం కోసం https://www.indiansinkuwait.com/campaign/worldcup/ లో పేర్లను నమోదు చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









