25 ఏళ్ల పాటు 25,000 దిర్హామ్‌ల 'సెకండ్ సాలరీ' గెలుచుకున్న భారత ప్రవాసుడు

- July 28, 2023 , by Maagulf
25 ఏళ్ల పాటు 25,000 దిర్హామ్‌ల \'సెకండ్ సాలరీ\' గెలుచుకున్న భారత ప్రవాసుడు

దుబాయ్: దుబాయ్‌లో ఐదేళ్లుగా ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనర్‌గా పని చేస్తున్న 33 ఏళ్ల భారతీయ ప్రవాసుడు మహమ్మద్ ఆదిల్ ఖాన్.. ఎమిరేట్స్ డ్రా విజేతగా నిలిచి 25 సంవత్సరాలపాటు నెలకు Dh25,000 అందుకోనున్నాడు. దుబాయ్‌లోని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న మహమ్మద్ ఆదిల్ ఖాన్ మాట్లాడుతూ.. "నేను ముందుగానే రిటైర్ అయ్యానని భావిస్తున్నాను. నేను డ్రాలో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఇక్కడ నేను అదృష్ట వంతునిగా నిలిచాను’’ అని సంతోషం వ్యక్తం చేశాడు. పని ముగించుకుని ఇంటికి చేరుకోగానే తనను అభినందన ఇమెయిల్ అందిందని ఇండియాలోని అజంగఢ్‌కు చెందిన ఖాన్ తెలిపారు. ఖాన్‌కు ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. వారందరి బాధ్యత తనపైనే ఉందన్నారు. తాను ఆ మొత్తాన్ని ఎలా ఖర్చు పెట్టాలో ఇంకా ప్లాన్ చేసుకోలేదన్నారు.  2018లో సౌదీ అరేబియా నుండి దుబాయ్‌కి  వచ్చానని, త్వరలోనే తన కుటుంబాన్ని యూఏఈకి తీసుకొస్తానని తెలిపారు.   

ఎమిరేట్స్ డ్రా దాదాపు 8 వారాల క్రితం తన FAST5 గేమ్‌ను ప్రారంభించింది. ఇది పాల్గొనేవారికి ఒకే ఒక్క Dh25 టిక్కెట్‌తో గెలవడానికి వేగవంతమైన మార్గాన్ని అందిస్తుంది. పాల్గొనేవారు రాబోయే 25 సంవత్సరాలలో ప్రతి నెల Dh25,000 అద్భుతమైన బహుమతి కోసం పోటీపడటమే కాకుండా, ముగ్గురు పాల్గొనేవారు రాఫిల్ డ్రాలో ఒక్కొక్కరు Dh75,000, Dh50,000 మరియు Dh25,000 గణనీయమైన మొత్తాలను గెలుచుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com