25 ఏళ్ల పాటు 25,000 దిర్హామ్ల 'సెకండ్ సాలరీ' గెలుచుకున్న భారత ప్రవాసుడు
- July 28, 2023
దుబాయ్: దుబాయ్లో ఐదేళ్లుగా ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనర్గా పని చేస్తున్న 33 ఏళ్ల భారతీయ ప్రవాసుడు మహమ్మద్ ఆదిల్ ఖాన్.. ఎమిరేట్స్ డ్రా విజేతగా నిలిచి 25 సంవత్సరాలపాటు నెలకు Dh25,000 అందుకోనున్నాడు. దుబాయ్లోని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న మహమ్మద్ ఆదిల్ ఖాన్ మాట్లాడుతూ.. "నేను ముందుగానే రిటైర్ అయ్యానని భావిస్తున్నాను. నేను డ్రాలో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఇక్కడ నేను అదృష్ట వంతునిగా నిలిచాను’’ అని సంతోషం వ్యక్తం చేశాడు. పని ముగించుకుని ఇంటికి చేరుకోగానే తనను అభినందన ఇమెయిల్ అందిందని ఇండియాలోని అజంగఢ్కు చెందిన ఖాన్ తెలిపారు. ఖాన్కు ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. వారందరి బాధ్యత తనపైనే ఉందన్నారు. తాను ఆ మొత్తాన్ని ఎలా ఖర్చు పెట్టాలో ఇంకా ప్లాన్ చేసుకోలేదన్నారు. 2018లో సౌదీ అరేబియా నుండి దుబాయ్కి వచ్చానని, త్వరలోనే తన కుటుంబాన్ని యూఏఈకి తీసుకొస్తానని తెలిపారు.
ఎమిరేట్స్ డ్రా దాదాపు 8 వారాల క్రితం తన FAST5 గేమ్ను ప్రారంభించింది. ఇది పాల్గొనేవారికి ఒకే ఒక్క Dh25 టిక్కెట్తో గెలవడానికి వేగవంతమైన మార్గాన్ని అందిస్తుంది. పాల్గొనేవారు రాబోయే 25 సంవత్సరాలలో ప్రతి నెల Dh25,000 అద్భుతమైన బహుమతి కోసం పోటీపడటమే కాకుండా, ముగ్గురు పాల్గొనేవారు రాఫిల్ డ్రాలో ఒక్కొక్కరు Dh75,000, Dh50,000 మరియు Dh25,000 గణనీయమైన మొత్తాలను గెలుచుకోవచ్చు.
తాజా వార్తలు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!
- సలాలా పోర్టు లో ఎయిర్ క్వాలిటీ పై ఆందోళన వద్దు..!!
- ముగియనున్న మలేషియా మైగ్రంట్ రేపట్రియేషన్ ప్రోగ్రాం 2.0 ఆమ్నెస్టీ పథకం
- డల్లాస్ లో NATS బోర్డు సమావేశం NATS మరింత విస్తరణ దిశగా అడుగులు









