కువైట్ చమురు మంత్రిత్వ శాఖలో మొదటి ఏఐ ఉద్యోగి 'నౌఫ్'
- August 01, 2023
కువైట్: కొత్త ఎలక్ట్రానిక్ కంటెంట్ను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్న మంత్రిత్వ శాఖలు మరియు చమురు రంగాల స్థాయిలో మొట్టమొదటిసారిగా కృత్రిమ మేధస్సు(ఏఐ) టెక్నాలజీని ఉపయోగించి చమురు మంత్రిత్వ శాఖ మొదటి పుస్తకాన్ని సోమవారం ప్రారంభించింది. ఇది దేశంలో చమురు పరిశ్రమను అభివృద్ధి చేయడంలో చేస్తున్న ప్రయత్నాలను సమీక్షిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా చమురు మంత్రిత్వ శాఖలో ఏఐ టెక్నాలజీతో పని చేస్తున్న తొలి మహిళా ఉద్యోగి నౌఫ్ ఫోటోని విడుదల చేశారు. వర్చువల్ ప్రెజెంటర్కు 'నౌఫ్' అనే పేరు పెట్టారు. ఆమె AI సాంకేతికతతో పని చేస్తున్న మొదటి మహిళా ఉద్యోగి అవుతుంది. కువైట్లో అతిథులు, చమురు వ్యవహారాలపై ఆసక్తి ఉన్నవారితో సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో మంత్రిత్వ శాఖ కొత్త మీడియా ఆమె వ్యవహారిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పుస్తకం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి చమురు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పుస్తకం ఇప్పుడు ఆయిల్ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లైన యూట్యూబ్, ఎక్స్ మరియు ఇన్స్టాగ్రామ్లలో అందుబాటులో ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం: సీఎం చంద్రబాబు
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక
- ఇరాన్ తో యుద్ధం.. USకు మద్దతిస్తున్న దేశాలివే!
- కువైట్లోని భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు
- నూతన చీఫ్ సెక్రటరీ వారికి శ్రీ కనక దుర్గమ్మ ఆశీస్సులు
- తెలంగాణలో అపోలో ఫార్మసీ వెయ్యి స్టోర్ల మైలురాయి
- ఈ ప్రభుత్వం మీది..అండగా ఉంటాం: సీఎం రేవంత్
- ఇరాన్ పై దాడుల ఎఫెక్ట్..ఎయిర్ ఇండియా విమానాల రద్దు
- వేట్లపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటన
- వేట్లపాలెం ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్









