కువైట్ చమురు మంత్రిత్వ శాఖలో మొదటి ఏఐ ఉద్యోగి 'నౌఫ్'
- August 01, 2023
కువైట్: కొత్త ఎలక్ట్రానిక్ కంటెంట్ను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్న మంత్రిత్వ శాఖలు మరియు చమురు రంగాల స్థాయిలో మొట్టమొదటిసారిగా కృత్రిమ మేధస్సు(ఏఐ) టెక్నాలజీని ఉపయోగించి చమురు మంత్రిత్వ శాఖ మొదటి పుస్తకాన్ని సోమవారం ప్రారంభించింది. ఇది దేశంలో చమురు పరిశ్రమను అభివృద్ధి చేయడంలో చేస్తున్న ప్రయత్నాలను సమీక్షిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా చమురు మంత్రిత్వ శాఖలో ఏఐ టెక్నాలజీతో పని చేస్తున్న తొలి మహిళా ఉద్యోగి నౌఫ్ ఫోటోని విడుదల చేశారు. వర్చువల్ ప్రెజెంటర్కు 'నౌఫ్' అనే పేరు పెట్టారు. ఆమె AI సాంకేతికతతో పని చేస్తున్న మొదటి మహిళా ఉద్యోగి అవుతుంది. కువైట్లో అతిథులు, చమురు వ్యవహారాలపై ఆసక్తి ఉన్నవారితో సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో మంత్రిత్వ శాఖ కొత్త మీడియా ఆమె వ్యవహారిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పుస్తకం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి చమురు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పుస్తకం ఇప్పుడు ఆయిల్ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లైన యూట్యూబ్, ఎక్స్ మరియు ఇన్స్టాగ్రామ్లలో అందుబాటులో ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







