కువైట్ చమురు మంత్రిత్వ శాఖలో మొదటి ఏఐ ఉద్యోగి 'నౌఫ్'
- August 01, 2023
కువైట్: కొత్త ఎలక్ట్రానిక్ కంటెంట్ను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్న మంత్రిత్వ శాఖలు మరియు చమురు రంగాల స్థాయిలో మొట్టమొదటిసారిగా కృత్రిమ మేధస్సు(ఏఐ) టెక్నాలజీని ఉపయోగించి చమురు మంత్రిత్వ శాఖ మొదటి పుస్తకాన్ని సోమవారం ప్రారంభించింది. ఇది దేశంలో చమురు పరిశ్రమను అభివృద్ధి చేయడంలో చేస్తున్న ప్రయత్నాలను సమీక్షిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా చమురు మంత్రిత్వ శాఖలో ఏఐ టెక్నాలజీతో పని చేస్తున్న తొలి మహిళా ఉద్యోగి నౌఫ్ ఫోటోని విడుదల చేశారు. వర్చువల్ ప్రెజెంటర్కు 'నౌఫ్' అనే పేరు పెట్టారు. ఆమె AI సాంకేతికతతో పని చేస్తున్న మొదటి మహిళా ఉద్యోగి అవుతుంది. కువైట్లో అతిథులు, చమురు వ్యవహారాలపై ఆసక్తి ఉన్నవారితో సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో మంత్రిత్వ శాఖ కొత్త మీడియా ఆమె వ్యవహారిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పుస్తకం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి చమురు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పుస్తకం ఇప్పుడు ఆయిల్ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లైన యూట్యూబ్, ఎక్స్ మరియు ఇన్స్టాగ్రామ్లలో అందుబాటులో ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!
- అనుమతి లేకుండా వ్యక్తిగత డేటా బహిర్గతం..తీవ్రమైన నేరం..!!
- అబుదాబి-దుబాయ్ E11లో EV మెగాహబ్..!!
- 1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- ముసందంలో డిస్కవరీ డైవింగ్ సెంటర్.. టూరిజానికి బూస్ట్..!!
- 2025లో కుటుంబం,బాలల రక్షణకు 4,400 రిపొర్టులు..!!
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం







