దాసోజు శ్రవణ్ ఆఫీస్ లో సంబరాలు
- August 01, 2023
హైదరాబాద్: బిఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆఫీస్ లో సంబరాలు మొదలయ్యాయి. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో హైదరాబాద్ ఇన్చార్జి దాసోజు శ్రవణ్ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ గా ప్రకటించారు. ఈ ప్రకటన తో ఆయన అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి. అలాగే మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ ను సైతం ఎమ్మెల్సీ గా ప్రకటించారు. ఎమ్మెల్సీలు ఫారూక్ హుస్సేన్, రాజేశ్వరరావు పదవీకాలం ముగియడంతో వారి స్థానాల్లో వీరిని ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ దాసోజు శ్రవణ్ బీసీ వర్గాల బలమైన గొంతుకగా ఎదిగారు. మంచి వాక్చాతుర్యం, ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వడం, జాతీయ మీడియాతో మాట్లాడే, తెలుగు, జాతీయ మీడియా డిబేట్లో సైతం పాల్గొని పార్టీ గళం వినిపించేవారిలో దాసోజు ముందు వరుసలో ఉంటారు. ప్రజారాజ్యంలో కొంతకాలంపాటు పనిచేసిన ఆయన ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి పలు హో దాల్లో పనిచేశారు. తెలంగాణ కోసం కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీకి బీఆర్ఎస్ సమర్పించిన చారిత్రక నివేదిక రూపకల్పన బృందం లో సభ్యుడిగా పనిచేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా తనపేరు ప్రతిపాదించడంపై సీఎం కేసీఆర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







