హిట్ డైరెక్టర్ని లైన్లో పెట్టిన చైతూ.!
- August 04, 2023
‘లవ్ స్టోరీ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన అక్కినేని హీరో నాగ చైతన్యకు, ‘కస్టడీ’ రూపంలో ఫెయిల్యూర్ దెబ్బ తగిలింది. దాంతో, తదుపరి సినిమా విషయంలో కాస్త ఆచి తూచి అడుగులేయబోతున్నాడు.
ఆ నేపథ్యంలోనే చందూ మొండేటితో చేతులు కలిపాడు. గతంలో ‘సవ్యసాచి’ సినిమాలో నటించాడు చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య. తాజాగా ‘కార్తికేయ 2’ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్గా చందూ మొండేటి.
ఇటీవల చైతూ వద్దకు ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ పట్టుకుని వచ్చాడట. వైజాగ్ పోర్ట్ నేపథ్యంలో మత్స్యారుల జీవితాలకు సంబంధించిన కాన్సెప్ట్ అనీ తెలుస్తోంది. ఈ కథ చైతూకి బాగా నచ్చిందట. దాంతో, ఆ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.
త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదికెళ్లనుందనీ తెలుస్తోంది. ఈ లోపు కథకు అనుగుణంగా వైజాగ్ పోర్టు వద్ద మత్స్యకారుల జీవితాలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాల్ని తెలుసుకోవడంలో ఇటు డైరెక్టర్, అటు చైతూ ఇద్దరూ బిజీ అయిపోయారట. చూడాలి మరి, ఇంతవరకూ చైతూ టచ్ చేయని ఈ డిఫరెంట్ సబ్జెక్ట్తోనైనా హిట్టు కొడతాడేమో.!
తాజా వార్తలు
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు
- యూఏఈలో సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఇంధన ధరలు
- కువైట్లో భారీగా మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్..!!
- ఒమన్లో వైద్య ఫీజుల మినహాయింపు జాబితాలో మార్పులు..!!
- సౌదీలో తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల జైలు..SR2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్లో వాట్సాప్ మెసేజ్లు, వాయిస్ మెసేజ్లు అప్పు ఆధారాలుగా పనికొస్తాయా?
- బహ్రెయిన్లో విషాదం.. బాత్టబ్లో పడి మూడేళ్ల భారతీయ బాలుడి మృతి..!!
- యూఏఈలో 52 మంది బిలియనీర్లు.. వీరి మొత్తం సంపద ఎంతంటే?
- యూఏఈలో భారతీయులకు బయోమెట్రిక్ డేటా మోసాలపై హెచ్చరిక







