ఉక్రెయిన్ సంక్షోభం. చర్చలకు సౌదీ అరేబియా ఆతిథ్యం
- August 05, 2023
జెడ్డా: ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై చర్చించేందుకు సౌదీ అరేబియా శనివారం జెడ్డాలో జాతీయ భద్రతా సలహాదారులు, అనేక దేశాల ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశం ఉక్రేనియన్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ చేసిన మానవతా కార్యక్రమంలో భాగంగా ఉంది. సంక్షోభం ప్రారంభం నుండి రష్యా -ఉక్రేనియన్ నాయకత్వాలతో ఆయన టచ్ లో ఉన్నారు. రెండు దేశాల మధ్య శాశ్వత శాంతికి దారితీసే పరిష్కారాన్ని చేరుకోవడంలో ఈ సమావేశం దోహదపడుతుందని, సంక్షోభం ప్రభావాలను తగ్గిస్తుందని సౌదీ అధికార యంత్రాంగం పేర్కొంది. దౌత్య మార్గాల ద్వారా సంక్షోభానికి రాజకీయ పరిష్కారాన్ని కనుగొనే మార్గాలపై అంతర్జాతీయ స్థాయిలో అభిప్రాయాలు, సమన్వయం, సహకారాన్ని బలోపేతం చేయడానికి ఈ సమావేశం దోహదపడుతుందని సౌదీ ప్రభుత్వం తెలిపింది.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







