ఉక్రెయిన్ సంక్షోభం. చర్చలకు సౌదీ అరేబియా ఆతిథ్యం
- August 05, 2023
జెడ్డా: ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై చర్చించేందుకు సౌదీ అరేబియా శనివారం జెడ్డాలో జాతీయ భద్రతా సలహాదారులు, అనేక దేశాల ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశం ఉక్రేనియన్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ చేసిన మానవతా కార్యక్రమంలో భాగంగా ఉంది. సంక్షోభం ప్రారంభం నుండి రష్యా -ఉక్రేనియన్ నాయకత్వాలతో ఆయన టచ్ లో ఉన్నారు. రెండు దేశాల మధ్య శాశ్వత శాంతికి దారితీసే పరిష్కారాన్ని చేరుకోవడంలో ఈ సమావేశం దోహదపడుతుందని, సంక్షోభం ప్రభావాలను తగ్గిస్తుందని సౌదీ అధికార యంత్రాంగం పేర్కొంది. దౌత్య మార్గాల ద్వారా సంక్షోభానికి రాజకీయ పరిష్కారాన్ని కనుగొనే మార్గాలపై అంతర్జాతీయ స్థాయిలో అభిప్రాయాలు, సమన్వయం, సహకారాన్ని బలోపేతం చేయడానికి ఈ సమావేశం దోహదపడుతుందని సౌదీ ప్రభుత్వం తెలిపింది.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









