ఉక్రెయిన్ సంక్షోభం. చర్చలకు సౌదీ అరేబియా ఆతిథ్యం
- August 05, 2023
జెడ్డా: ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై చర్చించేందుకు సౌదీ అరేబియా శనివారం జెడ్డాలో జాతీయ భద్రతా సలహాదారులు, అనేక దేశాల ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశం ఉక్రేనియన్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ చేసిన మానవతా కార్యక్రమంలో భాగంగా ఉంది. సంక్షోభం ప్రారంభం నుండి రష్యా -ఉక్రేనియన్ నాయకత్వాలతో ఆయన టచ్ లో ఉన్నారు. రెండు దేశాల మధ్య శాశ్వత శాంతికి దారితీసే పరిష్కారాన్ని చేరుకోవడంలో ఈ సమావేశం దోహదపడుతుందని, సంక్షోభం ప్రభావాలను తగ్గిస్తుందని సౌదీ అధికార యంత్రాంగం పేర్కొంది. దౌత్య మార్గాల ద్వారా సంక్షోభానికి రాజకీయ పరిష్కారాన్ని కనుగొనే మార్గాలపై అంతర్జాతీయ స్థాయిలో అభిప్రాయాలు, సమన్వయం, సహకారాన్ని బలోపేతం చేయడానికి ఈ సమావేశం దోహదపడుతుందని సౌదీ ప్రభుత్వం తెలిపింది.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







