ఆగస్టు 20న దుబాయ్ లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్
- August 05, 2023
దుబాయ్: భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దుబాయ్ లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, FOI ఈవెంట్స్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను నిర్వహించనుంది. ఆగస్టు 20న అల్ జెడ్డాఫ్ లోని అల్ వసల్ క్లబ్ లో ఈ కార్యక్రమం ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి బ్లడ్ క్యాంప్ ప్రారంభమవుతుంది. ఆసక్తి గల రక్తదాతలు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కాన్సులేట్ సూచించింది. ఆగస్టు 18వ తేదీలోపు ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం రిజిస్ట్రేషన్ వివరాలను [email protected] కు పంపాలని, లేదా foleventsllc.com/registration లాగిన్ కావాలని కాన్సులేట్ తన ప్రకటనలో వెల్లడించింది. మరిన్ని వివరాలకు ఆనంద్ జోషి(+971558973496), భాగ్యరాజ్ (+971543073084) లను సంప్రదించాలని సూచించింది.ఈ ఈవెంట్ కి మాగల్ఫ్.కాం మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







