ఆగస్టు 20న దుబాయ్ లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్

- August 05, 2023 , by Maagulf
ఆగస్టు 20న దుబాయ్ లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్

 దుబాయ్: భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దుబాయ్ లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, FOI ఈవెంట్స్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను నిర్వహించనుంది. ఆగస్టు 20న అల్ జెడ్డాఫ్ లోని అల్ వసల్ క్లబ్ లో ఈ కార్యక్రమం ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి బ్లడ్ క్యాంప్ ప్రారంభమవుతుంది. ఆసక్తి గల రక్తదాతలు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కాన్సులేట్ సూచించింది. ఆగస్టు 18వ తేదీలోపు ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం రిజిస్ట్రేషన్ వివరాలను  [email protected]  కు పంపాలని, లేదా  foleventsllc.com/registration లాగిన్ కావాలని కాన్సులేట్ తన ప్రకటనలో వెల్లడించింది. మరిన్ని వివరాలకు ఆనంద్ జోషి(+971558973496), భాగ్యరాజ్ (+971543073084) లను సంప్రదించాలని సూచించింది.ఈ ఈవెంట్ కి మాగల్ఫ్.కాం మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com