ఆగస్టు 20న దుబాయ్ లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్
- August 05, 2023
దుబాయ్: భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దుబాయ్ లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, FOI ఈవెంట్స్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను నిర్వహించనుంది. ఆగస్టు 20న అల్ జెడ్డాఫ్ లోని అల్ వసల్ క్లబ్ లో ఈ కార్యక్రమం ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి బ్లడ్ క్యాంప్ ప్రారంభమవుతుంది. ఆసక్తి గల రక్తదాతలు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కాన్సులేట్ సూచించింది. ఆగస్టు 18వ తేదీలోపు ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం రిజిస్ట్రేషన్ వివరాలను [email protected] కు పంపాలని, లేదా foleventsllc.com/registration లాగిన్ కావాలని కాన్సులేట్ తన ప్రకటనలో వెల్లడించింది. మరిన్ని వివరాలకు ఆనంద్ జోషి(+971558973496), భాగ్యరాజ్ (+971543073084) లను సంప్రదించాలని సూచించింది.ఈ ఈవెంట్ కి మాగల్ఫ్.కాం మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









