చైనాలో భారీ భూకంపం..
- August 06, 2023
చైనాలో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున బీజింగ్ కు 300 కిలోమీటర్ల దూరంలోని డెజౌ నగరంలో తెల్లవారుజామున 2:33 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.5గా నమోదయినట్లు చైనా ఎర్త్ క్వేక్ నెట్ వర్క్స్ సెంటర్ వెల్లడించింది. భూకంపం ప్రభావంతో డెజౌ నగరంలో 74 ఇళ్లు నేలమట్టమయ్యాయని ప్రభుత్వ మీడియా చైనా సెంట్రల్ టీవీ ప్రకటించింది. దీంతో 10 మంది గాయపడ్డారని పేర్కొంది.
అయితే ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలో మీటర్ల లోతులో భూమి కంపించినట్లు వెల్లడించింది. కాగా, శనివారం రాత్రి ఆఫ్ఘానిస్థాన్ లో భూకంపం సంబభవించిన విషయం తెలిసిందే. రాత్రి 9:31 గంటలకు హిందూకుష్ పర్వత శ్రేణుల్లో 5.8 తీవ్రతలో భూమి కంపించింది.
ఆఫ్ఘానిస్థాన్ తో పాటు పాకిస్తాన్, జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో 181 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. అయితే దీని ప్రభావంతో ఢిల్లీ ప్రాంతంలో కూడా భూమి కంపించింది. దీంతో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఇళ్ల నుంచి జనం బయటకు పరుగులు తీశారు. తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
తాజా వార్తలు
- పుణే మర్డర్ కేసు..సియా గోయల్ సోదరుడికి రూ.10 కోట్లు జరిమానా
- 'ది గేమ్చేంజర్స్ మిడిల్ ఈస్ట్'కు భారీ స్పందన..1,500 స్టార్టప్ దరఖాస్తులు
- ఎతిహాద్ రైల్కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం
- హిమాచల్ ప్రదేశ్ వరదలు..చిక్కుకుపోయిన 50 పర్యాటక వాహనాలు
- గ్రీస్లో UPIని ప్రారంభించిన భారత్
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!







