కువైట్ లో రెండు నెలల్లో 100 మంది ప్రవాసులు బహిష్కరణ
- August 08, 2023
కువైట్: రెండు నెలల్లో తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు సుమారు 100 మంది నివాసితులను దేశం నుండి బహిష్కరించారు. నివేదికల ప్రకారం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, అధిక వేగం, రోడ్లపై నిర్లక్ష్యంగా ఉండటం లేదా అక్రమంగా ప్రయాణీకులను తీసుకెళ్లడం వంటి తీవ్రమైన నేరాల కారణంగా సంబంధిత వ్యక్తులపై బహిష్కరణ వేటు వేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించనున్నట్టు ట్రాఫిక్ పెట్రోలింగ్ అధికారులు తెలిపారు. ఈ మేరకు తమకు అదేశాలు అందినట్టు పేర్కొన్నారు. ప్రవాస కార్మికులు ఉన్న కొన్ని ప్రాంతాలలో ఒక ప్రణాళిక బద్ధంగా డ్రైవింగ్ లైసెన్స్లను, వారు ఉపయోగించే వాహనాల మన్నికను తనిఖీ చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఎవరైనా తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడితే దేశం నుంచి బహిష్కరిస్తామని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







