కువైట్ లో రెండు నెలల్లో 100 మంది ప్రవాసులు బహిష్కరణ
- August 08, 2023
కువైట్: రెండు నెలల్లో తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు సుమారు 100 మంది నివాసితులను దేశం నుండి బహిష్కరించారు. నివేదికల ప్రకారం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, అధిక వేగం, రోడ్లపై నిర్లక్ష్యంగా ఉండటం లేదా అక్రమంగా ప్రయాణీకులను తీసుకెళ్లడం వంటి తీవ్రమైన నేరాల కారణంగా సంబంధిత వ్యక్తులపై బహిష్కరణ వేటు వేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించనున్నట్టు ట్రాఫిక్ పెట్రోలింగ్ అధికారులు తెలిపారు. ఈ మేరకు తమకు అదేశాలు అందినట్టు పేర్కొన్నారు. ప్రవాస కార్మికులు ఉన్న కొన్ని ప్రాంతాలలో ఒక ప్రణాళిక బద్ధంగా డ్రైవింగ్ లైసెన్స్లను, వారు ఉపయోగించే వాహనాల మన్నికను తనిఖీ చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఎవరైనా తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడితే దేశం నుంచి బహిష్కరిస్తామని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









