ఢిల్లీ మాయాపురి ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం..

- August 09, 2023 , by Maagulf
ఢిల్లీ మాయాపురి ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం..

న్యూ ఢిల్లీ: ఢిల్లీలో మాయాపురిలోని ఫ్యాక్టరీలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 9మంది గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున 2.05 గంటలకు ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక శాఖ వాహనాలు వచ్చి మంటలను అదుపు చేసేందుకు యత్నించారు. సోఫా స్ప్రింగ్ బాక్సులో మంటలు రాజుకున్నాయి.

మంటల్లో చిక్కుకున్న 9 మంది ఫ్యాక్టరీ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఫ్యాక్టరీ కార్మికులను దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. అవుటర్ ఢిల్లీ ఉద్యోగనగర్ ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో జులై 30వతేదీన అగ్నిప్రమాదం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com