కేంద్రం మరో వివాదాస్పద బిల్లు..
- August 10, 2023
న్యూ ఢిల్లీ: ఢిల్లీ ప్రతేక అధికారాల బిల్లును ఆమోదింప చేసుకున్న కేంద్ర ప్రభుత్వం మరో వివాదాస్పద బిల్లును తెరపైకి తీసుకొచ్చింది. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి నియమాక ప్యానెల్ నుంచి సీజేఐ నుంచి తప్పించేలా బిల్లును తెచ్చింది. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి నియామకంలో భారత ప్రధాన న్యాయమూర్తి ప్రమేయాన్ని తొలగించేలా బిల్లును రూపొందించింది.
చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ నియామకంలో ప్రధానమంత్రి సభ్యుడిగా ఉన్న కమిటీ, లోక్ సభ ప్రతిపక్షనేత, సీజేఐ కలిసి సీఈసీని నియమించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్(సీఈవో) నియామకాన్ని ప్రధానమంత్రి సభ్యుడిగా ఉన్న కమిటీ, లోక్ సభ ప్రతిపక్షనేత, సీజేఐకి కట్టబెడుతూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశానికి వ్యతిరేకంగా కేంద్రం ఈ బిల్లును తెచ్చింది.
ఎన్నికల ప్రధాన అధికారి నియామకంలో సీజేఐకి ప్రమేయం లేకుండా ఈ బిల్లును రూపొందించింది. ఈ బిల్లు చట్టం రూపం దాల్చితే సీఈసీ నియామక కమిటీల్లో సీజేఐకి ఎలాంటి అధికారం ఉండదు.
మార్చిలో సీజేఐ ఈ ఆదేశాలు ఇచ్చారు. కోలీజియం వ్యవస్థపై ఇప్పటికే కేంద్రానికి, సుప్రీంకోర్టుకు మధ్య విబేధాలు ఉన్నాయి.
ప్రధాన ఎన్నికల అధికారి నియామకంలోనూ సీజేఐ జోక్యం ఉండేలా తీర్పు ఇవ్వడం పట్ల కేంద్రం పెద్దలు అసంతృప్తిగా ఉన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఐదు నెలల తర్వాత కేంద్రం ప్రవేశపెట్టనున్న ఈ బిల్లుతో ఇది నిజమేనని తేలింది.
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్







