వర్క్ పర్మిట్ లేకుండా ప్రవాసిని నియమించుకున్నందుకు SR5,000 జరిమానా
- August 11, 2023
రియాద్: వర్క్ పర్మిట్ లేకుండా లేదా అజీర్ ప్రోగ్రామ్ను నోటిఫై చేసినందుకు విదేశీ ఉద్యోగిని నియమించినందుకు SR5,000 జరిమానా ఉంటుందని మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRSD) తెలిపింది. ఈ పెనాల్టీ అనేది కార్మిక చట్టంలో ఉల్లంఘనలు, జరిమానాల యొక్క సవరించిన షెడ్యూల్ ఆధారంగా మంత్రివర్గ నిర్ణయంలో ఇది ఒక భాగంగా ఉంది. షెడ్యూల్ తుది ముసాయిదాను మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం.. మంత్రిత్వ శాఖ ఆమోదించిన వృత్తిపరమైన రక్షణ, భద్రత మరియు ఆరోగ్యం నియమాలను యజమాని పాటించకపోవడం అలాగే అన్ని కార్యకలాపాలలో కార్మికులను రక్షించడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడంలో వైఫల్యం తీవ్రమైన ఉల్లంఘన కిందకు వస్తుంది. ఈ ఉల్లంఘన కోసం SR1500, SR5000 మధ్య జరిమానా విధించబడుతుంది. 50 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు పనిచేసే స్థాపనకు పిల్లల సంరక్షణ కోసం నిర్దేశిత స్థలం లేదా నర్సరీ లేకపోవడం తీవ్రమైన ఉల్లంఘన కాదని, ఉల్లంఘించిన వ్యక్తికి SR5000 జరిమానా విధించబడుతుందని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను నియమించుకోవడం తీవ్రమైన ఉల్లంఘన కిందకు వస్తుంది. ఇందుకు SR1,000 నుండి సుమారు SR2,000 వరకు జరిమానాలు ఉంటాయి. మంత్రివర్గ నిర్ణయం ప్రకారం, యజమాని వర్క్ పర్మిట్ పొందకుండా లేదా అజీర్ ప్రోగ్రామ్కు తెలియజేయకుండా సౌదీయేతర కార్మికుడిని నియమించుకోవడం తీవ్రమైన ఉల్లంఘనగా భావించి దీనికి మొత్తం SR10000 జరిమానా విధించబడుతుంది.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









