మాతృభూమి పురోగతికి ప్రతిఒక్కరూ కృషి చేయాలి
- August 11, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్ల ఆశయాల పట్ల హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా హర్షం వ్యక్తం చేశారు. మాతృభూమికి సేవ చేయాలనే నిరంతర ఆసక్తిని కలిగిఉండాలని పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ మతాలు, వర్గాల నుండి బహ్రెయిన్ పౌరులు గౌరవం, ప్రశంసలను పొందుతున్నారని తెలిపారు. "మా మాతృభూమి పురోగతిని పెంపొందించే అన్ని రంగాలలో పౌరులకు ఉత్తమమైన వాటిని అందించడానికి మేము ఆసక్తిగా ఉన్నాము" అని కింగ్ హమద్ చెప్పారు. "ది ఫఖ్రోస్ ఆఫ్ బహ్రెయిన్ – వ్యాపారులు, సంస్కర్తలు" అనే పుస్తకాన్ని తనకు బహూకరించిన డా. అలీ మహమ్మద్ ఫఖ్రో నేతృత్వంలోని అనేక మంది ఫఖ్రో కుటుంబ సభ్యులను అల్ సఫ్రియా ప్యాలెస్లో కలుసుకున్న సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రచురించబడిన ఈ పుస్తకాన్ని వ్యాపారవేత్త అడెల్ అబ్దుల్లా ఫఖ్రో రాశారు. దేశానికి సేవ చేయడంలో ఫఖ్రో కుటుంబం పాత్రను ఈ సందర్భంగా కింగ్ హమద్ ప్రశంసించారు.
తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









