మాతృభూమి పురోగతికి ప్రతిఒక్కరూ కృషి చేయాలి
- August 11, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్ల ఆశయాల పట్ల హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా హర్షం వ్యక్తం చేశారు. మాతృభూమికి సేవ చేయాలనే నిరంతర ఆసక్తిని కలిగిఉండాలని పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ మతాలు, వర్గాల నుండి బహ్రెయిన్ పౌరులు గౌరవం, ప్రశంసలను పొందుతున్నారని తెలిపారు. "మా మాతృభూమి పురోగతిని పెంపొందించే అన్ని రంగాలలో పౌరులకు ఉత్తమమైన వాటిని అందించడానికి మేము ఆసక్తిగా ఉన్నాము" అని కింగ్ హమద్ చెప్పారు. "ది ఫఖ్రోస్ ఆఫ్ బహ్రెయిన్ – వ్యాపారులు, సంస్కర్తలు" అనే పుస్తకాన్ని తనకు బహూకరించిన డా. అలీ మహమ్మద్ ఫఖ్రో నేతృత్వంలోని అనేక మంది ఫఖ్రో కుటుంబ సభ్యులను అల్ సఫ్రియా ప్యాలెస్లో కలుసుకున్న సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రచురించబడిన ఈ పుస్తకాన్ని వ్యాపారవేత్త అడెల్ అబ్దుల్లా ఫఖ్రో రాశారు. దేశానికి సేవ చేయడంలో ఫఖ్రో కుటుంబం పాత్రను ఈ సందర్భంగా కింగ్ హమద్ ప్రశంసించారు.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









