మాతృభూమి పురోగతికి ప్రతిఒక్కరూ కృషి చేయాలి
- August 11, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్ల ఆశయాల పట్ల హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా హర్షం వ్యక్తం చేశారు. మాతృభూమికి సేవ చేయాలనే నిరంతర ఆసక్తిని కలిగిఉండాలని పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ మతాలు, వర్గాల నుండి బహ్రెయిన్ పౌరులు గౌరవం, ప్రశంసలను పొందుతున్నారని తెలిపారు. "మా మాతృభూమి పురోగతిని పెంపొందించే అన్ని రంగాలలో పౌరులకు ఉత్తమమైన వాటిని అందించడానికి మేము ఆసక్తిగా ఉన్నాము" అని కింగ్ హమద్ చెప్పారు. "ది ఫఖ్రోస్ ఆఫ్ బహ్రెయిన్ – వ్యాపారులు, సంస్కర్తలు" అనే పుస్తకాన్ని తనకు బహూకరించిన డా. అలీ మహమ్మద్ ఫఖ్రో నేతృత్వంలోని అనేక మంది ఫఖ్రో కుటుంబ సభ్యులను అల్ సఫ్రియా ప్యాలెస్లో కలుసుకున్న సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రచురించబడిన ఈ పుస్తకాన్ని వ్యాపారవేత్త అడెల్ అబ్దుల్లా ఫఖ్రో రాశారు. దేశానికి సేవ చేయడంలో ఫఖ్రో కుటుంబం పాత్రను ఈ సందర్భంగా కింగ్ హమద్ ప్రశంసించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







