యూఏఈ పోలీసుల స్కామ్ అలెర్ట్
- August 14, 2023
యూఏఈ: బాధితులను తప్పుదారి పట్టించడంలో మోసగాళ్లు ఉపయోగించే వివిధ పద్ధతులకు వ్యతిరేకంగా అబుధాబి పోలీసులు నివాసితులను హెచ్చరించారు. మోసపూరిత కాల్లు, వెబ్సైట్లకు లింక్లు, నకిలీ SMS సందేశాల ద్వారా ప్రభుత్వ సంస్థల వలె నటించడం, ప్రజలకు నకిలీ సేవలు ఆఫర్ చేయడం, ప్రలోభాలకు గురిచేసే ఆఫర్ల ద్వారా స్కామర్లు బాధితులను తప్పుదారి పట్టిస్తారని పేర్కొంది. మోసపూరిత ఇంటర్నెట్ సైట్లు క్రెడిట్ కార్డుల చెల్లింపులపై ప్రత్యేక ఆఫర్లను అందించి మోసానికి పాల్పడతాయని, అలాంటి ప్రకటనలకు ఇంటరాక్ట్ కావద్దని సూచించింది. ఉద్యోగార్థులు ‘నకిలీ రిక్రూట్మెంట్’ పోస్టులపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇతరులతో ఖాతా లేదా కార్డ్ సమాచారం, ఆన్లైన్ బ్యాంకింగ్ పాస్వర్డ్లు లేదా ATM సెక్యూరిటీ నంబర్ (CCV) లేదా పాస్వర్డ్ వంటి వారి రహస్య సమాచారాన్ని పంచుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమ బ్యాంకింగ్ వివరాలను అప్డేట్ చేయమని అభ్యర్థిస్తూ ఎవరైనా గుర్తు తెలియని వారు వచ్చినా.. ఏవైనా కాల్స్ వచ్చినా సమీపంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి త్వరగా రిపోర్ట్ చేయాలని ప్రజలను అబుధాబి పోలీసులు కోరారు. భద్రతా సేవా నంబర్ 8002626కి కాల్ చేయవచ్చని లేదా 2828కి SMS పంపవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!
- పుణే మర్డర్ కేసు..సియా గోయల్ సోదరుడికి రూ.10 కోట్లు జరిమానా
- 'ది గేమ్చేంజర్స్ మిడిల్ ఈస్ట్'కు భారీ స్పందన..1,500 స్టార్టప్ దరఖాస్తులు
- ఎతిహాద్ రైల్కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం
- హిమాచల్ ప్రదేశ్ వరదలు..చిక్కుకుపోయిన 50 పర్యాటక వాహనాలు
- గ్రీస్లో UPIని ప్రారంభించిన భారత్
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!







