521 మనీ-లాండరింగ్ కేసుల్లో 387 మంది అరెస్ట్
- August 15, 2023
యూఏఈ: గత రెండు సంవత్సరాలలో 521 మనీలాండరింగ్ కేసులను సమర్థవంతంగా పరిష్కరించినట్లు యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈకేసులో ప్రపంచవ్యాప్తంగా 387 మంది వ్యక్తులను పట్టుకోవడానికి అంతర్జాతీయ చట్టాల అమలు సంస్థలతో కలిసి పనిచేసినట్టు పేర్కొంది. ఆయా కేసుల్లో Dhs4 బిలియన్లను మించి ఆస్తులను, బ్యాంకు డిపాజిట్లు, అకౌంట్లను ప్రీజ్ చేసినట్లు ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రి లెఫ్టినెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వెల్లడించారు. మనీలాండరింగ్కు వ్యతిరేకంగా జాతీయ వ్యూహాన్ని పర్యవేక్షించడానికి విదేశీ వ్యవహారాల మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నేతృత్వంలోని మనీలాండరింగ్ నిరోధక చర్యలు ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. అదే సమయంలో ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం చేయడంపై జాతీయ వ్యూహాన్ని పర్యవేక్షించే ఉన్నత కమిటీ చేపట్టిన తీవ్రమైన చర్యలను చేపట్టినట్లు షేక్ సైఫ్ తెలిపారు.
తాజా వార్తలు
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..









