521 మనీ-లాండరింగ్ కేసుల్లో 387 మంది అరెస్ట్
- August 15, 2023
యూఏఈ: గత రెండు సంవత్సరాలలో 521 మనీలాండరింగ్ కేసులను సమర్థవంతంగా పరిష్కరించినట్లు యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈకేసులో ప్రపంచవ్యాప్తంగా 387 మంది వ్యక్తులను పట్టుకోవడానికి అంతర్జాతీయ చట్టాల అమలు సంస్థలతో కలిసి పనిచేసినట్టు పేర్కొంది. ఆయా కేసుల్లో Dhs4 బిలియన్లను మించి ఆస్తులను, బ్యాంకు డిపాజిట్లు, అకౌంట్లను ప్రీజ్ చేసినట్లు ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రి లెఫ్టినెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వెల్లడించారు. మనీలాండరింగ్కు వ్యతిరేకంగా జాతీయ వ్యూహాన్ని పర్యవేక్షించడానికి విదేశీ వ్యవహారాల మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నేతృత్వంలోని మనీలాండరింగ్ నిరోధక చర్యలు ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. అదే సమయంలో ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం చేయడంపై జాతీయ వ్యూహాన్ని పర్యవేక్షించే ఉన్నత కమిటీ చేపట్టిన తీవ్రమైన చర్యలను చేపట్టినట్లు షేక్ సైఫ్ తెలిపారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







