ఒమన్ లో కింగ్ ఫిష్ వ్యాపారం, వేటపై రెండు నెలలు నిషేధం
- August 16, 2023
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్లో ఆగస్టు 15 నుండి అక్టోబర్ 15 వరకు రెండు నెలల పాటు కింగ్ఫిష్ చేపలు పట్టడం మరియు వ్యాపారం చేయడంపై నిషేధం విధించారు. ఈ మేరకు ఒమన్ వ్యవసాయ, మత్స్య మరియు జలవనరుల మంత్రిత్వ శాఖ (MAFWR) ఉత్తర్వులు జారీ చేసింది. సుల్తానేట్లో ఈ ఏడాది 2023లో చేపలు పట్టడం, కింగ్ఫిష్ చేపల వ్యాపారంపై నిషేధం అమలును ప్రారంభించినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నిబంధనల ప్రకారం ఆగస్టు 15 నుండి నుండి అక్టోబర్ 15 వరకు రెండు నెలల పాటు నిషేధం విధిస్తూ మంత్రివర్గ తీర్మానం నం. (230/2014 AD) చేశారు. ఫిషింగ్, మార్కెటింగ్ మరియు ఎగుమతి చేసే కింగ్ఫిష్లో పనిచేసే అన్ని మత్స్యకారులు, చేపల వాహకాలు, కంపెనీలు మరియు సంస్థలు దీనికి కట్టుబడి ఉండాలని ఆదేశించింది. కింగ్ ఫిష్ రిజిస్టర్ చేయబడితే తప్ప నిషేధ కాలంలో వాణిజ్యం లేదా ఎగుమతి చేయడానికి అనుమతించరు. ఉత్తర్వులు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు, జరిమానాలను విధించనున్నట్లు మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!









