ఒమన్ లో కింగ్ ఫిష్ వ్యాపారం, వేటపై రెండు నెలలు నిషేధం
- August 16, 2023
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్లో ఆగస్టు 15 నుండి అక్టోబర్ 15 వరకు రెండు నెలల పాటు కింగ్ఫిష్ చేపలు పట్టడం మరియు వ్యాపారం చేయడంపై నిషేధం విధించారు. ఈ మేరకు ఒమన్ వ్యవసాయ, మత్స్య మరియు జలవనరుల మంత్రిత్వ శాఖ (MAFWR) ఉత్తర్వులు జారీ చేసింది. సుల్తానేట్లో ఈ ఏడాది 2023లో చేపలు పట్టడం, కింగ్ఫిష్ చేపల వ్యాపారంపై నిషేధం అమలును ప్రారంభించినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నిబంధనల ప్రకారం ఆగస్టు 15 నుండి నుండి అక్టోబర్ 15 వరకు రెండు నెలల పాటు నిషేధం విధిస్తూ మంత్రివర్గ తీర్మానం నం. (230/2014 AD) చేశారు. ఫిషింగ్, మార్కెటింగ్ మరియు ఎగుమతి చేసే కింగ్ఫిష్లో పనిచేసే అన్ని మత్స్యకారులు, చేపల వాహకాలు, కంపెనీలు మరియు సంస్థలు దీనికి కట్టుబడి ఉండాలని ఆదేశించింది. కింగ్ ఫిష్ రిజిస్టర్ చేయబడితే తప్ప నిషేధ కాలంలో వాణిజ్యం లేదా ఎగుమతి చేయడానికి అనుమతించరు. ఉత్తర్వులు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు, జరిమానాలను విధించనున్నట్లు మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







