టిక్కెట్ల ధరలపై డిస్కౌంట్లను ప్రకటించిన ఎయిర్ ఇండియా

- August 18, 2023 , by Maagulf
టిక్కెట్ల ధరలపై డిస్కౌంట్లను ప్రకటించిన ఎయిర్ ఇండియా

దోహా: దోహా నుంచి ముంబై, ఢిల్లీలకు విమానాలను నడుపుతున్న ఎయిరిండియా ఎకానమీ, బిజినెస్ క్యాబిన్ల టిక్కెట్ ఛార్జీలపై ప్రత్యేక తగ్గింపులను ప్రకటించింది. ఆగస్టు 17న ప్రారంభమయ్యే పరిమిత-కాల ఆఫర్ ఆగస్టు 20 వరకు కొనసాగనుంది. ఈ తగ్గింపు సెప్టెంబర్ 1 నుండి అక్టోబర్ 31 వరకు ఇండియా, SAARC దేశాలలోని విమాన సర్వీసులకు చెల్లుబాటు అవుతుంది. యూరప్/యూకె మరియు గల్ఫ్ దేశాలకు ప్రయాణ వ్యవధి సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 31 మధ్య ఉండాలి.  ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ బుకింగ్‌లపై 30% వరకు తగ్గింపును అందిస్తోంది. సౌదీ అరేబియా నుండి వచ్చే ప్రయాణికులకు మినహా గల్ఫ్ దేశాల నుండి వచ్చే ప్రయాణీకులకు 10% వరకు తగ్గింపు ఇవ్వబడుతుంది. సౌదీ నుంచి వారు 15% వరకు తగ్గింపు పొందవచ్చు. అదే సమయంలో  బుకింగ్‌లకు 0% సౌలభ్యం రుసుమును మరియు ఫ్లయింగ్ రిటర్న్స్ సభ్యులకు 2X లాయల్టీ పాయింట్లను అందివ్వనున్నట్టు ఎయిర్‌లైన్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. పరిమిత సీట్లు అందుబాటులో ఉన్నందున తమ టిక్కెట్లను త్వరగా బుక్ చేసుకోవాలని విమానయాన సంస్థ తన ప్రకటనలో ప్రయాణికులను కోరింది.గ్రూప్ బుకింగ్‌పై ఈ సేల్ ఛార్జీ వర్తించదని, ఈ ఆఫర్ కింద చేసిన బుకింగ్‌కు ప్రామాణిక, రద్దు ఛార్జీలు వర్తిస్తాయని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com