బహ్రెయిన్‌లో పర్యటించనున్న భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

- August 18, 2023 , by Maagulf
బహ్రెయిన్‌లో పర్యటించనున్న భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

బహ్రెయిన్: భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సెప్టెంబర్ 7 నుంచి 9 వరకు బహ్రెయిన్‌లో పర్యటించనున్నారు. మ‌నామాలోని క్రౌన్ ప్లాజా హోట‌ల్‌లో ఆయ‌న ప‌ర్య‌ట‌న వివ‌రాల‌ను తెలియ‌జేసేందుకు మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. శ్రీ నారాయణ గురువు 169వ జయంతిలో భాగంగా శ్రీ నారాయణ కల్చరల్ సొసైటీ, గురుదేవ సోషల్ సొసైటీ, గురు సేవా సమితి బహ్రెయిన్ బిల్లావాస్ ఏర్పాటు చేసే కార్యక్రమంలో భారత మాజీ రాష్ట్రపతి పాల్గొంటారు. అలాగే బహ్రెయిన్‌లోని భారతీయ కమ్యూనిటీ సభ్యులతో సమావేశమవుతారు. సెప్టెంబర్ 8న కోవింద్ బహ్రెయిన్‌లోని ఇండియన్ స్కూల్‌లో "ట్రిబ్యూట్ టు బహ్రెయిన్" అనే పబ్లిక్ ఈవెంట్‌లో పాల్గొంటారు.   బహ్రెయిన్ భారతదేశానికి ప్రధాన వాణిజ్య భాగస్వామిగా ఉన్నది.ఇరుదేశాల మధ్య వాణిజ్యం మరియు పెట్టుబడులను పెంచడానికి ఇటీవల అనేక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ సమావేశంలో బహ్రెయిన్ బిల్లావాస్ కన్వీనర్ సంపత్ సువర్ణ, బహ్రెయిన్ బిల్లావాస్ ప్రెసిడెంట్ హరీష్ పూజారి, బిను రాజ్ రాజన్ (జనరల్ సెక్రటరీ, GSS), సనీష్ కూరుముల్లిల్ (ఛైర్మన్, GSS), సునీష్ సుశీలన్ (ఛైర్మన్, SNCS ), V. R. సజీవన్ (జనరల్ సెక్రటరీ, SNCS), సోమన్ బేబీ (ప్రోగ్రామ్ అడ్వైజర్), సురేష్ కరుణాకరన్ (జనరల్ కన్వీనర్), సోవిచన్ చెన్నట్టుస్సేరి (విజిట్ అడ్వైజర్) పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com