అడిస్ అబాబా చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు
- August 19, 2023
యూఏఈ: యూఏఈ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇథియోపియాలో అధికారిక పర్యటన కోసం అడిస్ అబాబా చేరుకున్నారు. బోలే అడిస్ అబాబా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబియ్ అహ్మద్ స్వాగతం పలికారు. ఇథియోపియాలో షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అధికారిక పర్యటనలో రెండు దేశాల అభివృద్ధికి ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకోనున్నారు. ఈ పర్యటన సందర్భంగా వ్యవసాయం, ఆహార భద్రత, ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత మరియు ఇతర రంగాలలో సహకారానికి ఇరుదేశాల ప్రతినిధుల బృందాలు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన రిసెప్షన్ కార్యక్రమానికి ఇథియోపియా నుంచి పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







