అడిస్ అబాబా చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు
- August 19, 2023
యూఏఈ: యూఏఈ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇథియోపియాలో అధికారిక పర్యటన కోసం అడిస్ అబాబా చేరుకున్నారు. బోలే అడిస్ అబాబా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబియ్ అహ్మద్ స్వాగతం పలికారు. ఇథియోపియాలో షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అధికారిక పర్యటనలో రెండు దేశాల అభివృద్ధికి ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకోనున్నారు. ఈ పర్యటన సందర్భంగా వ్యవసాయం, ఆహార భద్రత, ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత మరియు ఇతర రంగాలలో సహకారానికి ఇరుదేశాల ప్రతినిధుల బృందాలు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన రిసెప్షన్ కార్యక్రమానికి ఇథియోపియా నుంచి పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









