అడిస్ అబాబా చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు
- August 19, 2023
యూఏఈ: యూఏఈ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇథియోపియాలో అధికారిక పర్యటన కోసం అడిస్ అబాబా చేరుకున్నారు. బోలే అడిస్ అబాబా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబియ్ అహ్మద్ స్వాగతం పలికారు. ఇథియోపియాలో షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అధికారిక పర్యటనలో రెండు దేశాల అభివృద్ధికి ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకోనున్నారు. ఈ పర్యటన సందర్భంగా వ్యవసాయం, ఆహార భద్రత, ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత మరియు ఇతర రంగాలలో సహకారానికి ఇరుదేశాల ప్రతినిధుల బృందాలు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన రిసెప్షన్ కార్యక్రమానికి ఇథియోపియా నుంచి పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







