ఇండియా 'డిజిటల్ ఇన్నోవేషన్' పోటీకి రెండు ఒమానీ కంపెనీలు
- August 19, 2023
మస్కట్: భారతదేశంలో G20 సదస్సులో సుల్తానేట్ ఆఫ్ ఒమన్ పాల్గొంటున్న నేపథ్యంలో ఒమానీకి చెందిన రెండు కంపెనీలు "డిజిటల్ ఇన్నోవేషన్" పోటీలో పాల్గొననున్నాయి. ఇందులో మొత్తం 29 దేశాల నుండి 115 స్టార్టప్లు పాలు పంచుకుంటున్నాయి. ఒమన్ రవాణా, కమ్యూనికేషన్లు మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MTCIT) ఆధ్వర్యంలో ఒమానీ టెక్నాలజీ కంపెనీలకు అవకాశం కల్పించారు. ఈరెండు ఒమానీ కంపెనీలు (రాహల్(Rehal), H2SolarO) ఇండియాలో జరిగే G20 సమ్మిట్ కార్యకలాపాలలో భాగంగా నిర్వహిస్తున్న “డిజిటల్ ఇన్నోవేషన్” పోటీలో పాల్గొంటాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆగస్టు 17-19 వరకు పాంగ్లులో నిర్వహించబడుతున్న G20 డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ సదస్సు సందర్భంగా ఈ పోటీని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ పరిష్కారాలను అందించే అభివృద్ధి చెందుతున్న కంపెనీలను ప్రదర్శించడానికి, మద్దతు ఇవ్వడానికి ఇది ఒక ముఖ్యమైన వేదికగా దీనిని ఏర్పాటు చేశారు.
Rehal కంపెనీ 2018లో స్థాపించారు. ఇది కంపెనీ డేటా మేనేజ్మెంట్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, IT టెక్నాలజీ రిసోర్సింగ్ మరియు సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ రంగాలలో అనేక రకాల సేవలు, ఉత్పత్తులను అందిస్తుంది.
H2SolarO సంస్థ కంపెనీలకు గ్రీన్ ఎకానమీ సొల్యూషన్లను అందించడానికి పని చేస్తుంది. నిక వ్యవసాయ వనరుల నుండి ఉత్పన్నమైన జీవ ఇంధనాల అభివృద్ధి, ఉత్పత్తిని ప్రోత్సహించే లక్ష్యంతో అనేక రకాల ఉత్పత్తులు, సేవలను అందిస్తుంది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







