ఇండియా 'డిజిటల్ ఇన్నోవేషన్' పోటీకి రెండు ఒమానీ కంపెనీలు
- August 19, 2023
మస్కట్: భారతదేశంలో G20 సదస్సులో సుల్తానేట్ ఆఫ్ ఒమన్ పాల్గొంటున్న నేపథ్యంలో ఒమానీకి చెందిన రెండు కంపెనీలు "డిజిటల్ ఇన్నోవేషన్" పోటీలో పాల్గొననున్నాయి. ఇందులో మొత్తం 29 దేశాల నుండి 115 స్టార్టప్లు పాలు పంచుకుంటున్నాయి. ఒమన్ రవాణా, కమ్యూనికేషన్లు మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MTCIT) ఆధ్వర్యంలో ఒమానీ టెక్నాలజీ కంపెనీలకు అవకాశం కల్పించారు. ఈరెండు ఒమానీ కంపెనీలు (రాహల్(Rehal), H2SolarO) ఇండియాలో జరిగే G20 సమ్మిట్ కార్యకలాపాలలో భాగంగా నిర్వహిస్తున్న “డిజిటల్ ఇన్నోవేషన్” పోటీలో పాల్గొంటాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆగస్టు 17-19 వరకు పాంగ్లులో నిర్వహించబడుతున్న G20 డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ సదస్సు సందర్భంగా ఈ పోటీని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ పరిష్కారాలను అందించే అభివృద్ధి చెందుతున్న కంపెనీలను ప్రదర్శించడానికి, మద్దతు ఇవ్వడానికి ఇది ఒక ముఖ్యమైన వేదికగా దీనిని ఏర్పాటు చేశారు.
Rehal కంపెనీ 2018లో స్థాపించారు. ఇది కంపెనీ డేటా మేనేజ్మెంట్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, IT టెక్నాలజీ రిసోర్సింగ్ మరియు సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ రంగాలలో అనేక రకాల సేవలు, ఉత్పత్తులను అందిస్తుంది.
H2SolarO సంస్థ కంపెనీలకు గ్రీన్ ఎకానమీ సొల్యూషన్లను అందించడానికి పని చేస్తుంది. నిక వ్యవసాయ వనరుల నుండి ఉత్పన్నమైన జీవ ఇంధనాల అభివృద్ధి, ఉత్పత్తిని ప్రోత్సహించే లక్ష్యంతో అనేక రకాల ఉత్పత్తులు, సేవలను అందిస్తుంది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









