ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధo..
- May 18, 2016
దాదాపు రెండు నెలల పాటు సాగిన ఎన్నికల సమరానికి తెరపడింది. మరో 24 గంటల్లో పోరు ఫలితాలు వెలువడనున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
కేరళ, తమిళనాడు, పశ్చిమ్బంగ, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో గురువారం(మే 19) అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఐదు రాష్ట్రాల్లో బరిలో ఉన్న ప్రముఖ అభ్యర్థుల భవితవ్యం తెలిసిపోతుందన్నారు. 3 గంటల వరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది.మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరిగిన తర్వాత ఈవీఎం కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఎన్నికల ఫలితాలు వెలువడగానే.. గెలుపొందిన అభ్యర్థుల జాబితాను గెజెట్ రూపంలో విడుదల చేస్తారు.మే 16తో ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆయా రాష్ట్రాల్లో పార్టీల భవితవ్యం ఎలా ఉండనుందో ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన విషయం తెలిసిందే.ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. కేరళ, తమిళనాడు, అసోంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నట్లు తెలిసింది. తమిళనాడులో అమ్మ, కేరళలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం కన్పించలేదు. మరోవైపు ఈశాన్య రాష్ట్రమైన అసోంలో తొలిసారిగా భాజపా జెండా ఎగరనుంది. ఒక్క పశ్చిమ్బంగలో మాత్రమే మరోసారి మమతాబెనర్జీకి అధికారం కట్టబెట్టనున్నారు. ఇక కేంద్ర పాలితప్రాంతమైన పుదుచ్చేరిలో మాత్రం డీఎంకే కూటమితో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశముంది.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









