రతన్ టాటాకు ఉద్యోగ రత్న అవార్డు
- August 19, 2023
ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా కు మహారాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ రత్న అవార్డును ఇచ్చి సత్కరిచింది. శనివారం సీఎం ఏక్ నాథ్ షిండే ,డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ చేతుల మీదుగా ఉద్యోగ రత్న అవార్డును ప్రధానం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి ఉద్యోగ రత్న అవార్డు రతన్ టాటాను వరించింది. 85 ఏళ్ల రతన్ టాటా ఆరోగ్య సమస్యలతో బాధపడపడుతున్న విషయం తెలిసిందే. దీంతో దక్షి ముంబైలోని రతన్ టాటా ఇంటి వద్దకే వచ్చి అవార్డును సీఎం అందజేశారు. అవార్డుతో పాటు మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (MIDC) నుండి శాలువా, ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందజేశారు.
ఈ సందర్భంగా సీఎం ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ.. రతన్ టాటా, టాటా గ్రూప్స్ దేశానికి ఎనలేని సేవలందించాయన్నారని..అన్ని రంగాల్లోను టాటా గ్రూప్ విస్తరించిందని ఎన్నో వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డును స్వీకరించిన రతన్ టాటాకు ధన్యవాదాలు తెలిపారు.
కాగా..మహారాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ‘ఉద్యోగ రత్న’ అవార్డును తీసుకువచ్చింది. విశిష్ట వ్యక్తులకు ఇచ్చే మహారాష్ట్ర భూషణ్ అవార్డు మాదిరిగానే రతన్ టాటాను ఉద్యోగ రత్న అవార్డుతో సత్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టాటా గ్రూపు ఆరు ఖండాల్లో 100కిపైగా దేశాల్లో టాటా గ్రూప్ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో టాటా కంపెనీల మొత్తం ఆదాయం 128 బిలియన్ డాలర్లుగా ఉంది.
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్







