షువైఖ్ నౌకాశ్రయానికి చేరుకున్న ఇండియన్ నావల్ షిప్
- August 20, 2023
కువైట్: భారత నౌకాదళ నౌక INS విశాఖపట్నం కువైట్ లోని షువైఖ్ నౌకాశ్రయానికి చేరుకుంది. కమాండ్ ఆఫ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ వెస్ట్రన్ ఫ్లీట్, రియర్ అడ్మిరల్ వినీత్ మెక్కార్టీ ఆధ్వర్యంలోని నౌకాదళ నౌక ఐఎన్ఎస్ విశాఖపట్నం షిప్ కు షువైక్ పోర్ట్లో కువైట్ నేవల్ ఫోర్సెస్, బోర్డర్ గార్డ్స్ మరియు ఇండియన్ ఎంబసీ అధికారులు స్వాగతం పలికారు. ద్వైపాక్షిక నౌకాదళ సహకారంలో భాగంగా ఇండియన్ నావల్ షిప్ కువైట్ చేరకుందని అధికార యంత్రాంగం తెలిపింది. అనేక భారతీయ పాఠశాలల విద్యార్థులు కూడా షువైఖ్ పోర్ట్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ నౌకకు స్వాగతం పలికారు. భారత నౌకాదళం, కువైట్ నావికా దళం మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన అభ్యాసాలలో ఈ నౌక పాల్గొననుంది.
INS విశాఖపట్నం లీడ్ షిప్. విశాఖపట్నం క్లాస్ స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్లలో మొదటిది. మజాగాన్ డాక్ లిమిటెడ్ దేశీయంగా నిర్మించబడిన ఈ షిప్ ను 21 నవంబర్ 2021న ప్రారంభించారు. భారత నావికాదళంతో సేవలో ఉన్న అతిపెద్ద డిస్ట్రాయర్లలో ఇది ఒకటి. ఈ 164 మీటర్ల ఓడలో అత్యంత అధునాతన నావిగేషన్ మరియు కమ్యూనికేషన్ పరికరాలు, సెన్సార్లు, రాడార్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సామర్ధ్యంతో నిర్మించారు. ఈ నౌకలో రెండు హెలికాప్టర్లను తీసుకెళ్లేందుకు వీలుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర సవాళ్లను ఎదుర్కొనేలా దీనిని నిర్మించారు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







