వివాదంలో చిక్కుకున్న మంత్రి తలసాని
- August 20, 2023
హైదరాబాద్: వివాదాలకు దూరంగా ఉండే బిఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..తాజాగా వివాదంలో చిక్కుకొని వార్తల్లో నిలిచారు. హైదరాబాద్లో ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ చౌరస్తా వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జి (దివంగత నేత నాయిని నరసింహారెడ్డి ఫ్లైఓవర్)ని శనివారం మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు.
కాగా ఈ ప్రారంభ కార్యక్రమంలో ఓ వ్యక్తిని మంత్రి తలసాని కొట్టడం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. బ్రిడ్జి చూసేందుకు ఓ వ్యక్తి తలసాని కంటే ముందు వెళ్లారు. దీంతో అతన్ని వెనక్కి లాగి, చెంప దెబ్బ కొట్టారు తలసాని. దీంతో మంత్రిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దక్షిణ భారత దేశంలో రహదారిపై భారీ పొడవున స్టీల్ వినియోగంతో నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టు ఇదే. రూ.450 కోట్లతో 2.63 కిలోమీటర్ల మేర ఈ ఉక్కు వంతెన నిర్మించారు. జీహెచ్ఎంసీ చరిత్రలోనే భూ సేకరణ అవసరం లేకుండా జరిగిన ప్రాజెక్టు, అందులో మెట్రో మార్గం మీదుగా ఈ స్టీట్ బ్రిడ్జి ఏర్పాటు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ, హిందీ మహావిద్యాలయం వరకు వెళ్లేందుకు ప్రయాణ సమయం తగ్గుతుంది. ఇందిరా పార్క్, అశోక్నగర్, ఆర్టీసీ క్రాస్రోడ్లో ట్రాఫిక్ సమస్య లేకుండా వీఎస్టీ జంక్షన్ వరకు సులభంగా వెళ్లొచ్చు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం
- హిమాచల్ ప్రదేశ్ వరదలు..చిక్కుకుపోయిన 50 పర్యాటక వాహనాలు
- గ్రీస్లో UPIని ప్రారంభించిన భారత్
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!







