చైనా ప్రభుత్వం 2020 సంవత్సరం నాటికి దేశంలో 500 విమానాశ్రయాలు నిర్మించాలని ప్రణాళిక..
- May 18, 2016
చైనా ప్రభుత్వం 2020 సంవత్సరం నాటికి దేశంలో 500 విమానాశ్రయాలు నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సుమారు 153 బిలియన్ అమెరికా డాలర్ల వ్యయంతో అధిక సంఖ్యలో విమానాశ్రయాలు నిర్మించి విమానయానానికి మార్కెట్ పెంచే ప్రయత్నం చేస్తోంది. చైనా సెంట్రల్ కేబినెట్ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 500 విమానాశ్రయాలు నిర్మించనున్నారు. వ్యవసాయ, అటవీ ప్రాంతాల్లో, పర్యాటక ప్రాంతాల్లోనూ కొత్త విమానాశ్రయాలు వచ్చే అవకాశం ఉంది.విమానాల సంఖ్యను కూడా పెంచాలని చైనా నిర్ణయించింది. 2020 నాటికి హెలికాప్టర్లు, ప్రైవేటు జెట్స్, సాధారణ విమానాలు సహా అన్నింటి సంఖ్యను పెంచనున్నారు. 2020 నాటికి 5వేలకు పైగా విమానాలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. చైనా ఇటీవల మే 12న వైమానిక రంగంలో 723.8 మిలియన్ అమెరికా డాలర్లు ఖర్చు చేస్తామని ప్రకటించింది. చైనా రైల్వేలు, జాతీయరహదారులు, జలమార్గాలు, విమానాశ్రయాలు, అర్బన్ రైల్ ట్రాన్సిట్ల కోసం 303 ప్రాజెక్టులకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధంగా ఉంది. చైనా ఆర్థికవృద్ధి గత ఏడాది 6.9శాతానికి పడిపోయింది. ఈ ఏడాది జీడీపీ రేటు 6.5 నుంచి ఏడు శాతానికి పెంచాలని చైనా ప్రయత్నిస్తోంది. విమానయాన రంగాన్ని వృద్ధి చేయడానికి ప్రైవేటు పెట్టబడులను కూడా ఆహ్వానిస్తోంది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







