సౌదీలో చిక్కుకుపోయిన 150మంది తెలంగాణ కార్మికులు
- August 21, 2023
రియాడ్: సౌదీ అరేబియాలో 150 మంది భారతీయులు చిక్కుకున్నారు. వారంతా గతేడాదే సౌదీకి ఉద్యోగం కోసం వచ్చారు. కొన్నాళ్ల క్రితం చేస్తున్న ఉద్యోగం కోల్పోవడంతో గత 45 రోజులుగా వారంతా ఆకలి దప్పికలతో అలమటిస్తున్నారు. తమ స్వస్థలాలకు వచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం అందించాలని వారు కోరుతున్నారు. సౌదీలో చిక్కుకుపోయిన వారంతా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్, సిద్దిపేట్, కరీంనగర్, మంచిర్యాల్, రాజన్న సిరిసిల్లా, జోగులాంబ గద్వాల్ జిల్లా వాసులు. రియాద్ మునిసిపాలిటీలోని సప్లై డిపార్టుమెంట్ లో జూన్ 2022లో వారు ఉగ్యోగానికి చేరారు. 13 నెలలపాటు ఉద్యోగం చేస్తే.. కేవలం 11నెలల జీతం మాత్రమే అందిందని బాధితులు వాపోయారు. తమను గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారని, టెంట్లలో పెట్టారని పేర్కొన్నారు. తమ వద్ద ఉన్న ఇఖామా(రెసిడెన్స్ వీసా)ను ఆకస్మికంగా రద్దు చేశారని బాధితుడు దేవారెడ్డి మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







