24 గంటల్లో 70 మంది ప్రవాసులపై ట్రావెల్ బ్యాన్

- August 21, 2023 , by Maagulf
24 గంటల్లో 70 మంది ప్రవాసులపై ట్రావెల్ బ్యాన్

కువైట్: ట్రాఫిక్ జరిమానాలను క్లియర్ చేయడానికి ముందు ప్రవాసులు ప్రయాణించకుండా నిషేధించే కొత్త చట్టం అమల్లోకి వచ్చిన 24 గంటల్లో 70 మంది ప్రవాసులపై చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ చలానాలు చెల్లించని కారణంగా వారిపై ట్రావెల్ బ్యాన్ విధించనట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వారి వద్ద నుంచి ట్రాఫిక్ జరిమానాగా మొత్తం 66,000 దినార్లను సేకరించినట్లు తెలిపింది. ట్రావెల్ బ్యాన్ విధించిన వారిలో 50 మంది పురుషులు, 20 మంది మహిళలు ఉన్నారని పేర్కొంది.  దేశం విడిచి వెళ్లే ప్రవాసులందరూ ట్రాఫిక్ ఉల్లంఘనలను సమీక్షించుకోవాలని,  ప్రయాణంలో ఎలాంటి జాప్యాన్ని నివారించడానికి ముందుగానే క్లియర్ చేయాలని మంత్రిత్వ శాఖ కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com