24 గంటల్లో 70 మంది ప్రవాసులపై ట్రావెల్ బ్యాన్
- August 21, 2023
కువైట్: ట్రాఫిక్ జరిమానాలను క్లియర్ చేయడానికి ముందు ప్రవాసులు ప్రయాణించకుండా నిషేధించే కొత్త చట్టం అమల్లోకి వచ్చిన 24 గంటల్లో 70 మంది ప్రవాసులపై చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ చలానాలు చెల్లించని కారణంగా వారిపై ట్రావెల్ బ్యాన్ విధించనట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వారి వద్ద నుంచి ట్రాఫిక్ జరిమానాగా మొత్తం 66,000 దినార్లను సేకరించినట్లు తెలిపింది. ట్రావెల్ బ్యాన్ విధించిన వారిలో 50 మంది పురుషులు, 20 మంది మహిళలు ఉన్నారని పేర్కొంది. దేశం విడిచి వెళ్లే ప్రవాసులందరూ ట్రాఫిక్ ఉల్లంఘనలను సమీక్షించుకోవాలని, ప్రయాణంలో ఎలాంటి జాప్యాన్ని నివారించడానికి ముందుగానే క్లియర్ చేయాలని మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం
- హిమాచల్ ప్రదేశ్ వరదలు..చిక్కుకుపోయిన 50 పర్యాటక వాహనాలు
- గ్రీస్లో UPIని ప్రారంభించిన భారత్
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!







