‘KAUST’ కొత్త వ్యూహాన్ని ప్రారంభించిన క్రౌన్ ప్రిన్స్
- August 21, 2023
రియాద్: కింగ్ అబ్దుల్లా యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (KAUST) ట్రస్టీల బోర్డు ఛైర్మన్ కూడా అయిన క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ఆదివారం యూనివర్సిటీ యొక్క కొత్త వ్యూహాన్ని ప్రారంభించారు. రాజ్యం అభివృద్ధి కోసం విజన్ 2030 ఆకాంక్షలకు అనుగుణంగా వర్సిటీ ఆవిష్కరణల కేంద్రంగా మారడానికి కొత్త వ్యూహం కొత్త యుగానికి ప్రాతినిధ్యం వహిస్తుందని క్రౌన్ ప్రిన్స్ అన్నారు. "KAUST స్థాపించబడినప్పటి నుండి ఇది దాని పరిశోధన, ఆవిష్కరణలు, అధ్యాపకుల ద్వారా ప్రపంచంలోని ప్రముఖ పరిశోధనా విశ్వవిద్యాలయాలలో ఒకటిగా అవతరించింది." అని క్రౌన్ ప్రిన్స్ తెలిపారు. పరిశోధన, అభివృద్ధి మరియు ఆవిష్కరణల కోసం జాతీయ ప్రాధాన్యతలపై దృష్టి సారించడం ద్వారా పరిశోధనను ఆర్థికంగా ఉత్పాదక ఆవిష్కరణలుగా మార్చడం ఈ వ్యూహం లక్ష్యమన్నారు. వీటిలో ఆరోగ్యం, స్థిరమైన పర్యావరణం, పారిశ్రామిక నాయకత్వం మరియు భవిష్యత్ ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయని చెప్పారు. దీంతోపాటు సౌదీ విజన్ 2030 యొక్క లక్ష్యాలను సాధించడంలో దోహదపడే ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలతో KAUST భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. నేషనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్స్టిట్యూట్ ఫర్ అప్లైడ్ రీసెర్చ్ (NTI)ని ప్రారంభించడం; పరిశోధన, అభివృద్ధి మరియు ఆవిష్కరణల కోసం జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా పరిశోధనా కేంద్రాల పునర్నిర్మాణం, స్థానిక మరియు అంతర్జాతీయ సంస్థలలో అన్మెట్ పెట్టుబడిని అందించడానికి $200 మిలియన్ల ఫండ్ (SR750 మిలియన్లు) సృష్టించడం కొత్త వ్యుహాం లక్ష్యంగా నిర్దేశించామని, దీని వల్ల అధిక సంఖ్యలో సాంకేతిక ఉద్యోగాల సృష్టికి దోహదం చేస్తుందపి క్రౌన్ ప్రిన్స్ వివరించారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







