2023లో 225 సంస్థలకు 77 మిలియన్ దిర్హామ్‌లు జరిమానా

- August 22, 2023 , by Maagulf
2023లో 225 సంస్థలకు 77 మిలియన్ దిర్హామ్‌లు జరిమానా

యూఏఈ: మనీలాండరింగ్ మరియు టెర్రర్ ఫైనాన్సింగ్‌ కేసులకు సంబంధించి 2023 సంవత్సరంలో ఇప్పటివరకు 225 కంపెనీలపై చర్యలు తీసుకున్నట్లు యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చట్టాలను ఉల్లంఘించిన ఆయా కంపెనీలకు మొత్తం విలువ 76.9 మిలియన్ దిర్హామ్‌లు అడ్మినిస్ట్రేటివ్ పెనాల్టీలు విధించినట్లు  పేర్కొంది. అదే సమయంలో ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ యొక్క మనీలాండరింగ్ నిరోధక వ్యవస్థ (goAML)లో నమోదు చేయడంలో విఫలమైనందుకు 50 సంస్థలను మూడు నెలల పాటు సస్పెండ్ చేసినట్లు తెలిపింది. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (goAML) సిస్టమ్ ద్వారా అనుమానాస్పద లావాదేవీలపై తనిఖీలు చేపట్టినట్లు పేర్కొంది.      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com