భారత ఎంబసీ మిషన్ లైఫ్ ప్రచారం సక్సెస్
- August 22, 2023
మస్కట్: వాతావరణ మార్పుల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో మిషన్ లైఫ్ (పర్యావరణానికి జీవనశైలి) చొరవలో భాగంగా మస్కట్ లోని భారత రాయబార కార్యాలయం వారం రోజుల పాటు నిర్వహించిన అవగాహన ప్రచారం విజయవంతంగా ముగిసింది. ఆగస్ట్ 13 నుండి ఆగస్ట్ 19 వరకు సాగిన ఈ ప్రచారంలో వ్యర్థ వినియోగం నుండి వనరుల వినియోగంపై అవగాహన కల్పించారు. దైనందిన జీవితంలో పర్యావరణ అనుకూల పద్ధతులను అనుసరించేలా ప్రేరేపించడం ద్వారా వాతావరణ మా, గ్లోబల్ వార్మింగ్ సవాళ్లను పరిష్కరించడానికి కృషి చేశారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా పర్యావరణ ఔత్సాహికులు, ఒమన్లోని భారతీయ సంఘంలోని ప్రముఖ సభ్యులు పాల్గొన్నారు. ఈ మిషన్ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని వినిపించడంతోపాటు రాయబారి హెచ్.ఇ. అమిత్ నారంగ్ తన ప్రసంగంలో వాతావరణ మార్పులను పరిష్కరించాల్సిన ఆవశ్యకతను, ఈ లక్ష్యాన్ని సాధించడంలో మిషన్ లైఫ్ పాత్రను వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









