భారత ఎంబసీ మిషన్ లైఫ్ ప్రచారం సక్సెస్
- August 22, 2023
మస్కట్: వాతావరణ మార్పుల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో మిషన్ లైఫ్ (పర్యావరణానికి జీవనశైలి) చొరవలో భాగంగా మస్కట్ లోని భారత రాయబార కార్యాలయం వారం రోజుల పాటు నిర్వహించిన అవగాహన ప్రచారం విజయవంతంగా ముగిసింది. ఆగస్ట్ 13 నుండి ఆగస్ట్ 19 వరకు సాగిన ఈ ప్రచారంలో వ్యర్థ వినియోగం నుండి వనరుల వినియోగంపై అవగాహన కల్పించారు. దైనందిన జీవితంలో పర్యావరణ అనుకూల పద్ధతులను అనుసరించేలా ప్రేరేపించడం ద్వారా వాతావరణ మా, గ్లోబల్ వార్మింగ్ సవాళ్లను పరిష్కరించడానికి కృషి చేశారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా పర్యావరణ ఔత్సాహికులు, ఒమన్లోని భారతీయ సంఘంలోని ప్రముఖ సభ్యులు పాల్గొన్నారు. ఈ మిషన్ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని వినిపించడంతోపాటు రాయబారి హెచ్.ఇ. అమిత్ నారంగ్ తన ప్రసంగంలో వాతావరణ మార్పులను పరిష్కరించాల్సిన ఆవశ్యకతను, ఈ లక్ష్యాన్ని సాధించడంలో మిషన్ లైఫ్ పాత్రను వివరించారు.
తాజా వార్తలు
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!







