దుబాయ్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహణ...
- August 22, 2023
దుబాయ్: భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 20వ తేదీన FOI గ్రూప్ నిర్వహించిన మెగా రక్తదానం ప్రత్యేకంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 228 మంది ప్రవాసులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి దుబాయ్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా మద్దతు ఇచ్చింది. వైస్ కాన్సుల్ మనీందర్ సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. FOI ఈవెంట్స్ ను నిర్వహించిన వాలంటీర్ వెంకటేష్, FOI బృందాన్ని అభినందించారు. అనంతరం రక్తదానం చేశారు. తరచుగా రక్తదాన శిబిరాలను నిర్వహించడం ద్వారా దుబాయ్ కమ్యూనిటీకి సేవలందించినందుకు గత సంవత్సరం దుబాయ్ హెల్త్ అథారిటీ అధికారులు FOIని సత్కరించారు. 2006 నుండి FOI గ్రూప్ ‘బీ ఏ డోనర్ బీ ఏ హీరో’ అనే థీమ్ తో దుబాయ్లో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తోంది. దుబాయ్లోని లతీఫా హాస్పిటల్లో సంవత్సరంలో సుమారు 8 రక్తదాన శిబిరాలను నిర్వహిస్తుంది.




తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్







