దుబాయ్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహణ...
- August 22, 2023
దుబాయ్: భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 20వ తేదీన FOI గ్రూప్ నిర్వహించిన మెగా రక్తదానం ప్రత్యేకంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 228 మంది ప్రవాసులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి దుబాయ్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా మద్దతు ఇచ్చింది. వైస్ కాన్సుల్ మనీందర్ సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. FOI ఈవెంట్స్ ను నిర్వహించిన వాలంటీర్ వెంకటేష్, FOI బృందాన్ని అభినందించారు. అనంతరం రక్తదానం చేశారు. తరచుగా రక్తదాన శిబిరాలను నిర్వహించడం ద్వారా దుబాయ్ కమ్యూనిటీకి సేవలందించినందుకు గత సంవత్సరం దుబాయ్ హెల్త్ అథారిటీ అధికారులు FOIని సత్కరించారు. 2006 నుండి FOI గ్రూప్ ‘బీ ఏ డోనర్ బీ ఏ హీరో’ అనే థీమ్ తో దుబాయ్లో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తోంది. దుబాయ్లోని లతీఫా హాస్పిటల్లో సంవత్సరంలో సుమారు 8 రక్తదాన శిబిరాలను నిర్వహిస్తుంది.




తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









