దుబాయ్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహణ...
- August 22, 2023
దుబాయ్: భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 20వ తేదీన FOI గ్రూప్ నిర్వహించిన మెగా రక్తదానం ప్రత్యేకంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 228 మంది ప్రవాసులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి దుబాయ్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా మద్దతు ఇచ్చింది. వైస్ కాన్సుల్ మనీందర్ సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. FOI ఈవెంట్స్ ను నిర్వహించిన వాలంటీర్ వెంకటేష్, FOI బృందాన్ని అభినందించారు. అనంతరం రక్తదానం చేశారు. తరచుగా రక్తదాన శిబిరాలను నిర్వహించడం ద్వారా దుబాయ్ కమ్యూనిటీకి సేవలందించినందుకు గత సంవత్సరం దుబాయ్ హెల్త్ అథారిటీ అధికారులు FOIని సత్కరించారు. 2006 నుండి FOI గ్రూప్ ‘బీ ఏ డోనర్ బీ ఏ హీరో’ అనే థీమ్ తో దుబాయ్లో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తోంది. దుబాయ్లోని లతీఫా హాస్పిటల్లో సంవత్సరంలో సుమారు 8 రక్తదాన శిబిరాలను నిర్వహిస్తుంది.




తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







