అంతరిక్ష రంగంలో భారత్ చారిత్రాత్మక విజయం

- August 24, 2023 , by Maagulf
అంతరిక్ష రంగంలో భారత్ చారిత్రాత్మక విజయం

కువైట్: చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలుమోపిన తొలి దేశంగా భారత అవతరించింది. చంద్రయాన్-3 వ్యోమనౌక బుధవారం చంద్రుని ఉపతరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్, ఆపై లునార్ మూన్ పై కాలుమోపడం చకచకా వియవంతంగా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో హిస్ హైనెస్ అమీర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా భారత ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. అంతరిక్ష రంగంలో ఈ చారిత్రాత్మక విజయం మొత్తం మానవాళికి ఉపయోగపడుతుందని,  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సాధించిన ఈ ఘనత చిరస్మరణీయమని తన సందేశంలో హిస్ హైనెస్ అమీర్ పేర్కొన్నారు.  ఈ విజయాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వానికి, ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

కువైట్ క్రౌన్ ప్రిన్స్ హిస్ హైనెస్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైనందుకు అభినందనలు తెలుపుతూ కేబుల్ పంపారు. కువైట్ ప్రధాన మంత్రి హిస్ హైనెస్ షేక్ అహ్మద్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-సబా కూడా ఈ అద్భుతమైన విజయానికి భారతదేశాన్ని అభినందిస్తూ భారత ప్రధానికి అభినందన సందేశాన్ని పంపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com