టిల్లుగాని గాళ్ ఫ్రెండ్కి గెస్ట్ రోల్.?
- August 24, 2023
‘డీజె టిల్లు’ సినిమాతో ముద్దుగుమ్మ నేహా శెట్టికి మంచి పేరొచ్చింది. ఈ అమ్మడు ‘మెహబూబా’ సినిమాతో తెలుగు ప్రేక్సకులకు పరిచయమైంది. తొలి సినిమా నెగిటివ్ రిజల్ట్ ఇచ్చినప్పటికీ, మలి సినిమా ‘డీజె టిల్లు’తో తెగ పాపులర్ అయిపోయింది నేహా శెట్టి.
ముఖ్యంగా ఆమె పాత్ర పేరు యూత్కి బాగా కనెక్ట్ అయిపోయింది. ‘రాధిక’ అనే పేరుతో హీరో సిద్దు జొన్నల గడ్డ చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. తెగ వైరల్ అయ్యింది దాంతో, ఈ క్యారెక్టర్ పోషించిన నేహా శెట్టి.
ఆ తర్వాత పెద్దగా ఆఫర్లు దక్కకపోయినా, సోషల్ మీడియాలో క్రేజ్ దక్కించుకుంది. తాజాగా ‘బెదురులంక 2012’ సినిమాలో నటిస్తోంది. కార్తికేయ హీరో. ఈ శుక్రవారం ‘బెదురులంక’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేహాశెట్టికి మరో ఆఫర్ దక్కింది.
డీజె టిల్లుకు సీక్వెల్గా ‘టిల్లు స్క్వేర్’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో మెయిన్ లీడ్ హీరోయిన్గా నటిస్తుండగా, నేహా శెట్టి గెస్ట్ రోల్లో స్టన్నింగ్ పాత్రలో కనిపించబోతోందట. ఆల్రెడీ దీనికి సంబంధించిన షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయిందని తెలుస్తోంది. సెప్టెంబర్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







