AIలో దూసుకుపోతున్న భారత్..
- August 24, 2023
న్యూ ఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్వర్క్ అయిన లింక్డ్ఇన్ తమ మొదటి గ్లోబల్ ఫ్యూచర్ ఆఫ్ వర్క్: స్టేట్ ఆఫ్ వర్క్ @AI నివేదికను విడుదల చేసింది. ఇది ఉగ్యోగ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధస్సు) పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రధానంగా వెల్లడిస్తుంది. జనవరి 2016తో పోల్చితే జూన్ 2023లో భారతదేశంలో AI-నైపుణ్యం కలిగిన సభ్యులు 14 రెట్లు పెరిగారని భారతదేశ వ్యాప్తంగా చేసిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ వృద్ధి సింగపూర్, ఫిన్లాండ్, ఐర్లాండ్, కెనడాతో పాటుగా AI ప్రతిభను వృద్ధి చేసుకుంటున్న టాప్ 5 దేశాలలో ఇండియాను నిలిపింది.
గత సంవత్సర కాలంలో, భారతీయ శ్రామిక శక్తిలో 43% మంది తమ కార్యాలయాల్లో ఏఐ వినియోగాన్ని పెంచారని ఈ నివేదిక తెలిపింది. ఈ పెరుగుదల భారతదేశంలోని 60% మంది కార్మికులను 71% Gen Z నిపుణులను AI నైపుణ్యాలను పొందడం కెరీర్ అవకాశాలను మెరుగుపరుస్తుందట. అంతే కాకుండా, ప్రతి ముగ్గురు భారతీయులలో ఇద్దరు 2023లో కనీసం ఒక డిజిటల్ స్కిల్నైనా నేర్చుకుంటామని చెప్తున్నారు. AI, మెషిన్ లెర్నింగ్లు తాము నేర్చుకోవాలనుకునే అత్యుత్తమ నైపుణ్యాలలో తొలిస్థానాలలో ఉంటున్నాయని అంటున్నారు.
AI నైపుణ్యాలు పుంజుకోవడంతో, జాబ్ మార్కెట్పై వాటి ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. 2022లో, AI ప్రతిభావంతులను తీసుకోవడంలో పెరుగుదల APACలో మొత్తం నియామకాలను అధిగమించింది. భారతదేశం కోసం, 2023 AI నియామకాల పరంగా నిరంతర వృద్ధిని వాగ్దానం చేస్తుంది. భారతదేశపు టాప్ ఎగ్జిక్యూటివ్లలో సగం మంది ఈ సంవత్సరం AI ప్రతిభను మెరుగుపరచడం లేదా నియమించుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
అదే సమయంలో, 57% మంది ఎగ్జిక్యూటివ్లు వచ్చే ఏడాది తమ సంస్థల్లో AI వినియోగాన్ని మెరుగుపరచాలని యోచిస్తున్నారు. ఇది ప్రస్తుత వ్యాపార సంస్థలు తమ ప్రస్తుత వర్క్ఫోర్స్ను చురుకుగా రీస్కిల్ చేస్తున్నాయని, తద్వారా తమ బృందాలు చురుకైన స్వీకరించదగిన రీతిలో వుండాలని కోరుకుంటున్నారట.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’







