బ్రిక్స్ విస్తరణకు భారత్ ఎప్పుడూ అనుకూలమే : ప్రధాని మోడీ
- August 25, 2023
జొహాన్నెస్ బర్గ్: దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్ బర్గ్ నగరంలో రెండ్రోజుల పాటు జరిగిన బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) దేశాల సదస్సు ముగిసింది. దీనిపై భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ లో స్పందించారు. 15వ వార్షిక బ్రిక్స్ సమావేశం సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ కూటమిని మరింత విస్తరించాలన్న అభిప్రాయానికి ఆమోదం లభించిందని తెలిపారు. బ్రిక్స్ విస్తరణకు భారత్ ఎల్లప్పుడూ అనుకూలమేనని మోడీ స్పష్టం చేశారు.
ఈ విస్తరణ వల్ల బ్రిక్స్ మరింత బలోపేతం అవుతుందని, ఎక్కువ ప్రభావవంతంగా మారుతుందని పేర్కొన్నారు. ఈ స్ఫూర్తితోనే అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈలను బ్రిక్స్ లోకి భారత్ ఆహ్వానిస్తోందని ప్రధాని మోడీ వివరించారు.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







