మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పట్నం మహేందర్రెడ్డి
- August 25, 2023
హైదరాబాద్ : కేబినెట్ మంత్రిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మహేందర్రెడ్డి చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కెసిఆర్తో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సిఎం కెసిఆర్ తనకు రెండో సారి మంత్రి పదవీ అందించినందకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వికారాబాద్, తాండూరు జిల్లాలో బిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తానని తెలిపారు. గతంలో తాను స్వల్ప తేడాతో రోహిత్ రెడ్డి చేతిలో ఓడిపోయానని గుర్తు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించడమే లక్ష్యంగా పని చేస్తానని తెలిపారు. వాస్తవానికి రెండు, మూడు రోజుల కిందటే మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణం చేయాల్సి ఉంది. కానీ గవర్నర్ తమిళి సై పాండిచ్చేరిలో ఉండటంతో ప్రమాణ స్వీకారం ఈరోజు చేయాల్సి వచ్చింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







