ఫస్ట్ టర్మ్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఇండియన్ స్కూల్ స్టూడెంట్స్
- September 01, 2023
యూఏఈ: ఎమిరేట్స్ లోని కొన్ని భారతీయ పాఠ్యప్రణాళిక పాఠశాలలు త్వరలో తమ టర్మ్ పరీక్షలను ప్రారంభించబోతున్నాయి. విద్యార్థులు ఇప్పటికే మొదటి టర్మ్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. పరీక్షలు ఎక్కువగా సెప్టెంబర్ రెండవ వారంలో ప్రారంభమవుతాయి. రానున్న పరీక్షల్లో ఇవాల్యుయేషన్ చేయాల్సిన దాదాపు అన్ని సిలబస్లు వేసవి సెలవుల ప్రారంభానికి ముందే పూర్తయ్యాయని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. పాఠశాలలు వేసవి సెలవులకు ముందే షెడ్యూల్ గురించి విద్యార్థులకు, తల్లిదండ్రులకు సమాచారం అందించాయి. దుబాయ్లోని GEMS అవర్ ఓన్ ఇండియన్ స్కూల్ ప్రిన్సిపాల్ లలితా సురేష్ మాట్లాడుతూ.. వేసవి సెలవులు ముగిసేలోపు పరీక్షల షెడ్యూల్ను విద్యార్థులు, తల్లిదండ్రులకు ముందే తెలియజేసినట్లు తెలిపారు. పరీక్షలు సెప్టెంబరు 15 నుంచి ప్రారంభం కానున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







