జయకు,మమతాబెనర్జీకి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి .

- May 19, 2016 , by Maagulf
జయకు,మమతాబెనర్జీకి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి .

పశ్చిమ్‌బంగ, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అన్నాడీఎంకే, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలు భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నాయి. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. జయలలితతో ఫోన్‌లో మాట్లాడానని.. అన్నాడీఎంకే విజయం సాధిస్తున్నందుకు శుభాకాంక్షలు తెలిపినట్లు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.అనంతరం బంగాల్‌ సీఎం మమతాబెనర్జీకి కూడా మోదీ ఫోన్‌ చేశారు. వరుసగా రెండోసారి అధికారంలోకి రానున్న దీదీకి అభినందనలు తెలియజేసినట్లు మోదీ ట్వీట్‌ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com