తెరాస అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు భారీ విజయం..

- May 19, 2016 , by Maagulf
తెరాస అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు భారీ విజయం..

 ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు భారీ విజయం సాధించారు. తెలంగాణ అధికారపక్షం అంచనాలకు తగ్గట్లే భారీ అధిక్యతను సొంతం చేసుకోవటం గమనార్హం. తొలి రౌండ్‌ నుంచి తుమ్మల తన అధిపత్యాన్ని స్పష్టంగా ప్రదర్శించారు.తొలి రౌండ్‌లో 5426 ఓట్ల అధిక్యతతో తన ఖాతాను మొదలుపెట్టిన తుమ్మల రెండో రౌండ్‌ నాటికి పదివేల అధిక్యతకు దగ్గరకు వచ్చారు. నాలుగో రౌండ్‌ ముగిసేసరికి 16446 ఓట్ల అధిక్యతలో ఉన్న ఆయన ఆరో రౌండ్‌ ముగిసేసరికి 20884 ఓట్ల మెజార్టీలో ఉన్నారు.15వ రౌండ్‌ ముగిసేసరికి తుమ్మల 41,473 ఓట్ల అధిక్యతలో ఉన్నారు. ఇక.. 16 రౌండ్‌ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి 44050 ఓట్ల అధిక్యతలో ఉన్నారు. లెక్కించాల్సిన ఓట్ల కంటే మెజార్టీ అధికంగా ఉన్న నేపథ్యంలో తుమ్మల విజయం సాధించినట్లైంది. తుమ్మల విజయాన్ని ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com