సిగ్నల్ జంప్ ప్రమాదాలు. ఇద్దరు మృతి, 73 మందికి గాయాలు
- September 04, 2023
దుబాయ్: సిగ్నల్ జంప్ అత్యంత ప్రమాదకరమైన ట్రాఫిక్ ఉల్లంఘనలలో ఒకటిగా ఈ ఏడాది నిలిచింది. నేరానికి సంబంధించిన షాకింగ్ గణాంకాలను దుబాయ్ పోలీసులు వెల్లడించారు. పోలీసులు గత ఏడు నెలల్లో 51 ప్రమాదాలను నమోదు చేశారు. వీటిల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, 73 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. "ప్రస్తుత సంవత్సరంలో సిగ్నల్ జంప్ కు సంబంధించి 13,875 పైగా ఉల్లంఘనలు జారీ చేయబడ్డాయి. ఉల్లంఘనలపై సుమారు 855 వాహనాలు జప్తు చేయబడ్డాయి" అని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ మేజర్ జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి చెప్పారు. ఫెడరల్ ట్రాఫిక్ చట్టం ప్రకారం, సిగ్నల్ జంప్ చేస్తే 1,000 దిర్హామ్ జరిమానా, లైసెన్స్పై 12 బ్లాక్ పాయింట్లు మరియు 30 రోజుల వాహన జప్తు విధించబడుతుంది. దీంతోపాటు దుబాయ్లో ఇటీవల అమలు చేయబడిన ఒక చట్టం నేరానికి Dh50,000 జరిమానా, లైసెన్స్పై 23 బ్లాక్ పాయింట్లతో జరిమానా విధించింది.
తాజా వార్తలు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!
- సౌదీ అరేబియాలో హాటెస్ట్ మంత్ గా జూలై ఉండబోతుందా?
- అండర్ 16 సోషల్ మీడియా బ్యాన్..ఆస్ట్రేలియా సంచలన స్టడీ..!!
- షాపింగ్ ప్రియులకు లూలూ హైపర్మార్కెట్ కువైట్ శుభవార్త..!!
- 52 మాగ్నెట్స్ మింగిన 5 ఏళ్ల బాలుడు..డాక్టర్లు ఏమన్నారంటే?
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్







