సిగ్నల్ జంప్ ప్రమాదాలు. ఇద్దరు మృతి, 73 మందికి గాయాలు

- September 04, 2023 , by Maagulf
సిగ్నల్ జంప్ ప్రమాదాలు. ఇద్దరు మృతి, 73 మందికి గాయాలు

దుబాయ్: సిగ్నల్ జంప్ అత్యంత ప్రమాదకరమైన ట్రాఫిక్ ఉల్లంఘనలలో ఒకటిగా ఈ ఏడాది నిలిచింది. నేరానికి సంబంధించిన షాకింగ్ గణాంకాలను దుబాయ్ పోలీసులు వెల్లడించారు. పోలీసులు గత ఏడు నెలల్లో 51 ప్రమాదాలను నమోదు చేశారు. వీటిల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, 73 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. "ప్రస్తుత సంవత్సరంలో సిగ్నల్ జంప్ కు సంబంధించి 13,875 పైగా ఉల్లంఘనలు జారీ చేయబడ్డాయి. ఉల్లంఘనలపై సుమారు 855 వాహనాలు జప్తు చేయబడ్డాయి" అని జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ మేజర్ జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి చెప్పారు.   ఫెడరల్ ట్రాఫిక్ చట్టం ప్రకారం, సిగ్నల్ జంప్ చేస్తే  1,000 దిర్హామ్ జరిమానా, లైసెన్స్‌పై 12 బ్లాక్ పాయింట్లు మరియు 30 రోజుల వాహన జప్తు విధించబడుతుంది. దీంతోపాటు దుబాయ్‌లో ఇటీవల అమలు చేయబడిన ఒక చట్టం నేరానికి Dh50,000 జరిమానా, లైసెన్స్‌పై 23 బ్లాక్ పాయింట్లతో జరిమానా విధించింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com