సిగ్నల్ జంప్ ప్రమాదాలు. ఇద్దరు మృతి, 73 మందికి గాయాలు
- September 04, 2023
దుబాయ్: సిగ్నల్ జంప్ అత్యంత ప్రమాదకరమైన ట్రాఫిక్ ఉల్లంఘనలలో ఒకటిగా ఈ ఏడాది నిలిచింది. నేరానికి సంబంధించిన షాకింగ్ గణాంకాలను దుబాయ్ పోలీసులు వెల్లడించారు. పోలీసులు గత ఏడు నెలల్లో 51 ప్రమాదాలను నమోదు చేశారు. వీటిల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, 73 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. "ప్రస్తుత సంవత్సరంలో సిగ్నల్ జంప్ కు సంబంధించి 13,875 పైగా ఉల్లంఘనలు జారీ చేయబడ్డాయి. ఉల్లంఘనలపై సుమారు 855 వాహనాలు జప్తు చేయబడ్డాయి" అని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ మేజర్ జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి చెప్పారు. ఫెడరల్ ట్రాఫిక్ చట్టం ప్రకారం, సిగ్నల్ జంప్ చేస్తే 1,000 దిర్హామ్ జరిమానా, లైసెన్స్పై 12 బ్లాక్ పాయింట్లు మరియు 30 రోజుల వాహన జప్తు విధించబడుతుంది. దీంతోపాటు దుబాయ్లో ఇటీవల అమలు చేయబడిన ఒక చట్టం నేరానికి Dh50,000 జరిమానా, లైసెన్స్పై 23 బ్లాక్ పాయింట్లతో జరిమానా విధించింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







