టీటీడీ పాలక మండలి సంచలన నిర్ణయాలు..
- September 06, 2023
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది. యువతలో సనాతన ధర్మం, హైందవ ధర్మవ్యాప్తికి ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పాలక మండలి సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో ప్రధానమైంది.. గోవిందకోటి రాస్తే వీఐపీ బ్రేక్ దర్శనం. చిన్నతనం నుంచే యువతలో భక్తిభావాన్ని పెంపొందించేందుకు 25ఏళ్లలోపు యువత కోటి గోవింద నామాలు పూర్తిచేస్తే.. వారి కుటుంబానికి ఒకసారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. యువతీ లేదా యువకుడు 10,01,116 సార్లు గోవింద నామాలు రాస్తే ఆ వ్యక్తికి స్వామివారి బ్రేక్ దర్శనం కల్పించేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. అంతేకాక, ఎల్కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు ఉచితంగా 20 పేజీలున్న కోటి భగవద్గీత పుస్తకాలు శ్రీవారి ప్రసాదంగా పంపిణీ చేయనున్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









