ఇరాన్-సౌదీ సంబంధాల్లో కీలక ముందడుగు..!
- September 06, 2023
టెహ్రాన్: ఇరాన్ మరియు సౌదీ అరేబియా ఈ ప్రాంతంతోపాటు ఇస్లామిక్ ప్రపంచంలో రెండు ప్రభావవంతమైన దేశాలని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అన్నారు. మెరుగైన ఇరాన్-సౌదీ సంబంధాలు ఈ ప్రాంతంలో విదేశీ జోక్యాల పరిధిని తగ్గించగలవని రైసీ చెప్పారు. సౌదీ అరేబియాకు నియమించబడిన ఇరాన్ రాయబారి అలీరెజా ఎనయాటి రియాద్కు బయలుదేరే ముందు ఇరాన్ అధ్యక్షుడిని కలిసారు. టెహ్రాన్, రియాద్ మధ్య సంబంధాలను మరింత ప్రోత్సహించాలని ఈ సందర్భంగా రైసీ పిలుపునిచ్చారు. 2023 మార్చి 10న బీజింగ్లో చైనా మధ్యవర్తిత్వం వహించిన చారిత్రాత్మక ఒప్పందంలో సౌదీ అరేబియా, ఇరాన్ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను పునఃప్రారంభించాలని.. ఏడేళ్ల విరామం తర్వాత తమ దౌత్య కార్యకలాపాలను పునఃప్రారంభించాలని నిర్ణయించుకున్నాయి. మరోవైపు ఇరాన్లో సౌదీ అరేబియా కొత్త రాయబారి అబ్దుల్లా అల్-ఎనెజీ మంగళవారం తన బాధ్యతలను స్వీకరించేందుకు ఇరాన్ రాజధాని టెహ్రాన్ చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న ఆయనకు ఇరాన్ సీనియర్ అధికారులు స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







