క్రిప్టో స్కామ్‌లో $20,000 కోల్పోయిన అబుధాబి వ్యాపారవేత్త..!

- September 07, 2023 , by Maagulf
క్రిప్టో స్కామ్‌లో $20,000 కోల్పోయిన అబుధాబి వ్యాపారవేత్త..!

యూఏఈ: అబుధాబిలోని ఒక భారతీయ వ్యాపారవేత్త స్కామ్ బారీన పడ్డారు. క్రిప్టోకరెన్సీ స్కామ్‌లో $20,000 (Dh73,461) నష్టపోయాడు. రషీద్ ఆలం (అభ్యర్థనపై పేరు మార్చబడింది) మార్చిలో వాట్సాప్ మెసేజ్‌ వచ్చింది. ఒక వ్యక్తి తనను తాను నాన్సీగా పేర్కొన్నాడు. అతనికి "ఇంకా కొన్ని ఉత్పత్తులు అవసరమా" అని విచారిస్తూ విదేశీ సెల్ ఫోన్ నంబర్ నుండి అతనిని సంప్రదించాడు. రస్ అల్ ఖైమాలో తన మాజీ వ్యాపార సంస్థ కోసం నాన్సీ అనే వ్యక్తి నుండి పారిశ్రామిక రసాయనాలను సేకరించిన నేపథ్యంలో రషీద్ అతనితో మాటలు కలిపాడు.   నాన్సీ వ్యాపార చతురతకు రషీద్ ముగ్ధుడయ్యాడు. యూఏఈతో సహా మిడిల్ ఈస్ట్ అంతటా అభివృద్ధి చెందుతున్న వస్త్ర వ్యాపారాన్ని తాను నిర్వహించినట్లు ఆమె చెప్పారు. ఈ క్రమంలో నాన్సీ తన మామ క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ద్వారా డబ్బు సంపాదించడంలో తనకు సహాయం చేస్తున్నట్లు ఆమె పేర్కొంది. నాన్సీ సిఫార్సు చేసిన క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లో $1,000 పెట్టుబడి పెట్టడం ద్వారా కొద్ది రోజుల్లోనే అది $3,000కి పెరిగింది.  ఈ క్రమంలో నమ్మకం కుదరడంతో రషీద్ $20,000 పెట్టుబడి పెట్టాడు. కానీ తన లాభాలను తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, 30% పన్ను కట్టాలని తెలిపారు.దీంతో ఇదంతా స్కామ్ అని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో విచారణ జరిపిన అధికారులు రషీద్‌లకు సిఫార్సు చేసిన క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లు నకిలీవని దర్యాప్తులో వెల్లడైంది.   సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులు, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని యూఏఈ అధికారులు సూచించారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com