ఒక్కరోజే రెండు శుభవార్తలు ..

- May 19, 2016 , by Maagulf
ఒక్కరోజే రెండు శుభవార్తలు ..

 తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఒక్కరోజే రెండు బంపర్‌ ఆఫర్లు వచ్చినట్లయింది. ఒక పక్క ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యాపిల్‌ సంస్థ.. తమ ఆవిష్కరణ కేంద్రాన్ని ఈ రోజు హైదరాబాద్‌లో ప్రారంభించింది. దీంతో ఇక్కడ గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌లాంటి దిగ్గజ సంస్థల సరసన యాపిల్‌ కూడా చేరిపోయి భాగ్యనగర ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేసింది.మరో పక్క ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టమైన మెజారిటీతో భారీ విజయాన్ని సాధించారు. కాంగ్రెస్‌ కంచుకోటను బద్ధలుగొట్టి ఆయన అక్కడ విజయ బావుటా ఎగరవేశారు. మొదటి రౌండ్‌ నుంచీ అదే జోరుతో ఆధిక్యతను ప్రదర్శించారు. 45 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కాంగ్రెస్‌ అభ్యర్థి సుచరితారెడ్డి ఓటమి చెందారు. ఈ రెండు పరిణామాలతో తెరాస అధినేతలు ఒక్కరోజే రెండు శుభవార్తలు విన్నట్లయ్యింది. దీంతో వారికి ఈ రోజు ఓ మధుర స్మృతిగా మిగిలిపోనుంది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com