ఫెడ్ నిర్ణయం ప్రపంచ బంగారం ధరలపై భారీ ప్రభావం ..
- May 19, 2016
అమెరికా ఫెడ్ రిజర్వు జూన్ లో మరోమారు వడ్డీరేట్లను పెంచబోతోందనే సంకేతాల నేపథ్యంలో బంగారం ధరలు తగ్గు ముఖం పట్టాయి. 30వేల స్థాయి నిలదొక్కుకునే ప్రయత్నంలో ఇటీవల విఫలమైన బంగారం ధర మరింత పతనమై 30వేల రూపాయల కిందికి దిగజారింది. ఫెడ్ ప్రకనటతో గురువారం బులియన్ మార్కెట్ లో పసిడి ధరల జోరుకు భారీ బ్రేక పడింది. సుమారు మూడువారాల దిగువకు పడిపోయాయి. 314 రూపాయల నష్టంతో పది గ్రాముల పసిడి ధర 29,741రూపాయలుగా నమోదైంది. వెండిధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. ఇటీవల స్తాయిలో నిలదొక్కుకోవడంలో విఫలమైన పసిడి ఇపుడు మరింత వెలవెలబోతోంది. అటు ఫెడ్ రిజర్వు వడ్డన తప్పదనే వార్తలతో డాలర్ దూసుకుపోతుండగా, ఆసియన్ మార్కెట్లు నష్టాల బాటపట్టాయి. ఇక ఇతర విలువైన లోహాల సంగతి కొస్తే వెండి, పల్లాడియం స్వల్పంగా పెరగ్గా, ప్లాటినం ధరల్లో స్వల్ప క్షీణత నమోదైంది. అయితే పసిడి ధరల తగ్గుదలు పెట్టుబడిదారులు కొనుగోళ్లకు వినియోగించుకుంటారని గోల్డ్ ఫండ్ మేనేజర్ రిచర్డ్ అభిప్రాయపడ్డారు. ఫెడ్ నిర్ణయం ప్రపంచ బంగారం ధరలపై భారీ ప్రభావం చూపబోదని తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







