యూఏఈలో రక్తదానం చేసిన మమ్ముట్టి ఫ్యాన్స్
- September 08, 2023
యూఏఈ: మలయాళ నటుడు మమ్ముట్టి అభిమానులు నిర్వహించిన రక్తదాన శిబిరంలో యూఏఈలో 300 మందికి పైగా పాల్గొన్నారు. సెప్టెంబర్ 7 మమ్ముట్టి 72వ పుట్టినరోజు సందర్భంగా 18 దేశాలలో 25,000 మంది రక్తదానం చేయడానికి ప్రపంచవ్యాప్త పిలుపులో భాగంగా యూఏఈలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. యూఏఈలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమ నిర్వాహకుల్లో ఒకరైన సఫీద్ మహ్మద్ మాట్లాడుతూ.. ‘‘మా హీరో పుట్టినరోజును ఎంతో మందికి ఉపయోగపడే విధంగా నిర్వహించాలనుకుంటున్నాం. మేము గత వారం ఆస్ట్రేలియాలో రక్తదాన ప్రచారంతో ఈ ప్రచారాన్ని ప్రారంభించాము."అని తెలిపారు. యూఏఈలో మూడు వారాల పాటు మూడు ఎమిరేట్స్లో క్యాంపులు జరిగాయన్నారు. క్యూసైస్లోని లులు హైపర్మార్కెట్లో గురువారం చివరి శిబిరం జరిగిందని, అందులో వందలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు తరలివచ్చారని తెలిపారు.
మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడిగా ఉన్న మమ్ముట్టి ఐదు దశాబ్దాల నుండి సినీమా రంగంలో ఉన్నారు. వివిధ భాషలలో 400 చిత్రాలలో నటించాడు. భారతదేశంలో అనేక అత్యున్నత పురస్కారాలను గెలుచుకున్న అతను దేశంలోని అత్యుత్తమ నటులలో ఒకరిగా గుర్తింపు పొందాడు. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకు గాను, అతను 1998లో భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందుకున్నాడు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









