యూఏఈలో రక్తదానం చేసిన మమ్ముట్టి ఫ్యాన్స్
- September 08, 2023
యూఏఈ: మలయాళ నటుడు మమ్ముట్టి అభిమానులు నిర్వహించిన రక్తదాన శిబిరంలో యూఏఈలో 300 మందికి పైగా పాల్గొన్నారు. సెప్టెంబర్ 7 మమ్ముట్టి 72వ పుట్టినరోజు సందర్భంగా 18 దేశాలలో 25,000 మంది రక్తదానం చేయడానికి ప్రపంచవ్యాప్త పిలుపులో భాగంగా యూఏఈలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. యూఏఈలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమ నిర్వాహకుల్లో ఒకరైన సఫీద్ మహ్మద్ మాట్లాడుతూ.. ‘‘మా హీరో పుట్టినరోజును ఎంతో మందికి ఉపయోగపడే విధంగా నిర్వహించాలనుకుంటున్నాం. మేము గత వారం ఆస్ట్రేలియాలో రక్తదాన ప్రచారంతో ఈ ప్రచారాన్ని ప్రారంభించాము."అని తెలిపారు. యూఏఈలో మూడు వారాల పాటు మూడు ఎమిరేట్స్లో క్యాంపులు జరిగాయన్నారు. క్యూసైస్లోని లులు హైపర్మార్కెట్లో గురువారం చివరి శిబిరం జరిగిందని, అందులో వందలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు తరలివచ్చారని తెలిపారు.
మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడిగా ఉన్న మమ్ముట్టి ఐదు దశాబ్దాల నుండి సినీమా రంగంలో ఉన్నారు. వివిధ భాషలలో 400 చిత్రాలలో నటించాడు. భారతదేశంలో అనేక అత్యున్నత పురస్కారాలను గెలుచుకున్న అతను దేశంలోని అత్యుత్తమ నటులలో ఒకరిగా గుర్తింపు పొందాడు. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకు గాను, అతను 1998లో భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందుకున్నాడు.
తాజా వార్తలు
- Radhika Das-Performing live for the first time in the UAE
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్
- నగరాభివృద్ధి పనులపై సీఎం రేవంత్ సమీక్ష
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!







