యూఏఈలో రక్తదానం చేసిన మమ్ముట్టి ఫ్యాన్స్
- September 08, 2023
యూఏఈ: మలయాళ నటుడు మమ్ముట్టి అభిమానులు నిర్వహించిన రక్తదాన శిబిరంలో యూఏఈలో 300 మందికి పైగా పాల్గొన్నారు. సెప్టెంబర్ 7 మమ్ముట్టి 72వ పుట్టినరోజు సందర్భంగా 18 దేశాలలో 25,000 మంది రక్తదానం చేయడానికి ప్రపంచవ్యాప్త పిలుపులో భాగంగా యూఏఈలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. యూఏఈలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమ నిర్వాహకుల్లో ఒకరైన సఫీద్ మహ్మద్ మాట్లాడుతూ.. ‘‘మా హీరో పుట్టినరోజును ఎంతో మందికి ఉపయోగపడే విధంగా నిర్వహించాలనుకుంటున్నాం. మేము గత వారం ఆస్ట్రేలియాలో రక్తదాన ప్రచారంతో ఈ ప్రచారాన్ని ప్రారంభించాము."అని తెలిపారు. యూఏఈలో మూడు వారాల పాటు మూడు ఎమిరేట్స్లో క్యాంపులు జరిగాయన్నారు. క్యూసైస్లోని లులు హైపర్మార్కెట్లో గురువారం చివరి శిబిరం జరిగిందని, అందులో వందలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు తరలివచ్చారని తెలిపారు.
మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడిగా ఉన్న మమ్ముట్టి ఐదు దశాబ్దాల నుండి సినీమా రంగంలో ఉన్నారు. వివిధ భాషలలో 400 చిత్రాలలో నటించాడు. భారతదేశంలో అనేక అత్యున్నత పురస్కారాలను గెలుచుకున్న అతను దేశంలోని అత్యుత్తమ నటులలో ఒకరిగా గుర్తింపు పొందాడు. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకు గాను, అతను 1998లో భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందుకున్నాడు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక