కేరళ తరపున ఆడనున్న కువైట్కు చెందిన భారతీయ విద్యార్థిని
- September 08, 2023
కువైట్: కువైట్లోని ఇండియన్ ఎడ్యుకేషనల్ స్కూల్కు చెందిన 15 ఏళ్ల విద్యార్థిని నేహా సుసాన్ బిజు కువైట్ నుండి కేరళ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన మొదటి బ్యాడ్మింటన్ ప్లేయర్గా అవతరించనుంది. ఐఈఎస్ భవన్ కువైట్లోని 10వ తరగతి విద్యార్థిని సెప్టెంబర్ 14 - 19 వరకు భారతదేశంలోని హైదరాబాద్లో జరగనున్న అండర్-17 కేటగిరీ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023లో పాల్గొననుంది. అలాగే మిక్స్డ్ డబుల్స్ విభాగంలో నేహా భారత్కు చెందిన చేజ్ సిజోతో జట్టుకట్టనుంది.
నేహా కువైట్లో.. భారతదేశంలో అనేక టోర్నమెంట్లలో పాల్గొని విజేతగా నిలిచింది. 2023 వేసవిలో, 2023 జూలై 20 నుండి 23వ తేదీ వరకు కొల్లంలోని నాజర్ స్కూల్ ఆఫ్ బ్యాడ్మింటన్, కరునాగపల్లిలో జరిగిన ప్రతిష్టాత్మక కేరళ స్టేట్ జూనియర్ (15 & 17 ఏళ్లలోపు) ఛాంపియన్షిప్లో మిక్స్డ్ డబుల్స్ U-17 విభాగంలో ఆమె ఇటీవలి విజయం అందించింది. దీంతో కేరళ రాష్ట్ర జట్టులో ప్రవేశించడానికి ఆమెకు ఒక సువర్ణావకాశం లభించింది.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!