కేరళ తరపున ఆడనున్న కువైట్కు చెందిన భారతీయ విద్యార్థిని
- September 08, 2023
కువైట్: కువైట్లోని ఇండియన్ ఎడ్యుకేషనల్ స్కూల్కు చెందిన 15 ఏళ్ల విద్యార్థిని నేహా సుసాన్ బిజు కువైట్ నుండి కేరళ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన మొదటి బ్యాడ్మింటన్ ప్లేయర్గా అవతరించనుంది. ఐఈఎస్ భవన్ కువైట్లోని 10వ తరగతి విద్యార్థిని సెప్టెంబర్ 14 - 19 వరకు భారతదేశంలోని హైదరాబాద్లో జరగనున్న అండర్-17 కేటగిరీ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023లో పాల్గొననుంది. అలాగే మిక్స్డ్ డబుల్స్ విభాగంలో నేహా భారత్కు చెందిన చేజ్ సిజోతో జట్టుకట్టనుంది.
నేహా కువైట్లో.. భారతదేశంలో అనేక టోర్నమెంట్లలో పాల్గొని విజేతగా నిలిచింది. 2023 వేసవిలో, 2023 జూలై 20 నుండి 23వ తేదీ వరకు కొల్లంలోని నాజర్ స్కూల్ ఆఫ్ బ్యాడ్మింటన్, కరునాగపల్లిలో జరిగిన ప్రతిష్టాత్మక కేరళ స్టేట్ జూనియర్ (15 & 17 ఏళ్లలోపు) ఛాంపియన్షిప్లో మిక్స్డ్ డబుల్స్ U-17 విభాగంలో ఆమె ఇటీవలి విజయం అందించింది. దీంతో కేరళ రాష్ట్ర జట్టులో ప్రవేశించడానికి ఆమెకు ఒక సువర్ణావకాశం లభించింది.
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







