కేరళ తరపున ఆడనున్న కువైట్‌కు చెందిన భారతీయ విద్యార్థిని

- September 08, 2023 , by Maagulf
కేరళ తరపున ఆడనున్న కువైట్‌కు చెందిన భారతీయ విద్యార్థిని

కువైట్: కువైట్‌లోని ఇండియన్ ఎడ్యుకేషనల్ స్కూల్‌కు చెందిన 15 ఏళ్ల విద్యార్థిని నేహా సుసాన్ బిజు కువైట్ నుండి కేరళ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన మొదటి బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా అవతరించనుంది. ఐఈఎస్ భవన్ కువైట్‌లోని 10వ తరగతి విద్యార్థిని సెప్టెంబర్ 14 - 19 వరకు భారతదేశంలోని హైదరాబాద్‌లో జరగనున్న అండర్-17 కేటగిరీ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2023లో పాల్గొననుంది. అలాగే మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో నేహా భారత్‌కు చెందిన చేజ్ సిజోతో జట్టుకట్టనుంది.

నేహా కువైట్‌లో.. భారతదేశంలో అనేక టోర్నమెంట్‌లలో పాల్గొని విజేతగా నిలిచింది. 2023 వేసవిలో, 2023 జూలై 20 నుండి 23వ తేదీ వరకు కొల్లంలోని నాజర్ స్కూల్ ఆఫ్ బ్యాడ్మింటన్, కరునాగపల్లిలో జరిగిన ప్రతిష్టాత్మక కేరళ స్టేట్ జూనియర్ (15 & 17 ఏళ్లలోపు) ఛాంపియన్‌షిప్‌లో మిక్స్‌డ్ డబుల్స్ U-17 విభాగంలో ఆమె ఇటీవలి విజయం అందించింది. దీంతో కేరళ రాష్ట్ర జట్టులో ప్రవేశించడానికి ఆమెకు ఒక సువర్ణావకాశం లభించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com